వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం..నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు

ట్రాఫిక్ ఆంక్షలు

తెలంగాణలో రాజధాని హైదరాబాద్ లోని అమ్మవార్ల ఆలయాల్లో ఆషాడ మాసం సందడి నెలకొంటుంది. ఇవాళ (మంగళవారం) నగరంలో ప్రముఖ దేవాలయం బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు సతీసమేతంగా ఆలయానికి విచ్చేసి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రులతో పాటు భారీగా భక్తులు ఈ కల్యాణోత్సవాన్ని కనులారా తిలకించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. కళ్యాణోత్సవం సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి భక్తుల తాకిడి పెరగనుంది. దీంతో నగర పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పరిసరాల్లో ప్రధాన రోడ్లపై ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.