వరుసగా మెగా హీరో వార్‌

War Between Allu Arjun And Ram Charan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగా ఫ్యామిలీ నుండి హీరోలు ఎక్కువ అవ్వడంతో ఆ ఫ్యామిలీ హీరోల మద్యే పోటీ వాతావరణం ఏర్పడుతుంది. పలువురు మెగా హీరోలు కంటిన్యూగా సినిమాలు చేస్తున్న కారణంగా సినిమాల విడుదల విషయంలో క్లాష్‌లు వస్తున్నాయి. తాజాగా సాయి ధరమ్‌ తేజ్‌ ‘ఇంటిలిజెంట్‌’ మరియు వరుణ్‌ తేజ్‌ ‘తొలిప్రేమ’ చిత్రాలు విడుదల ఒకే రోజు అవ్వడంతో మెగా ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. మెగా ఫ్యాన్స్‌ ఒత్తిడి మేరకు ‘తొలిప్రేమ’ చిత్రం నిర్మాతలు ఒక్కరోజు ఆలస్యంగా అంటే ఫిబ్రవరి 10న విడుదల చేసేందుకు ఓకే చెప్పారు. కేవలం ఒక్క రోజు తేడాతో రాబోతున్న ‘తొలిప్రేమ’, ‘ఇంటిలిజెంట్‌’ చిత్రాలు కలెక్షన్స్‌ పరంగా ఖచ్చితంగా నష్టపోవాల్సి వస్తుందనే టాక్‌ వినిపిస్తుంది.

పెద్ద సినిమాల మద్య రెండు వారాలు, చిన్న చిత్రాల మద్య కనీసం ఒక్క వారం గ్యాప్‌ ఉంటేనే కలెక్షన్స్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని అలా కాకుండా వెంటవెంటనే సినిమాలు విడుదలైతే రెండు సినిమాలకు కూడా కలెక్షన్స్‌ పరంగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని సినీ విశ్లేషకుల అభిప్రాయం. ఏప్రిల్‌లో మరో మెగా వార్‌కు తెర లేవబోతుంది. రామ్‌ చరణ్‌ ‘రంగస్థలం’ చిత్రాన్ని మార్చి 30న విడుదల చేయబోతున్నారు. ఇక అల్లు అర్జున్‌ ‘నా పేరు సూర్య’ చిత్రాన్ని ఏప్రిల్‌ రెండవ వారంలోనే విడుదల చేయబోతున్నారు. ఈ రెండు చిత్రాలు కూడా భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు కొద్ది గ్యాప్‌తో రావడం వల్ల కలెక్షన్స్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని సినీ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాని వేరే దారి లేకపోవడంతో నిర్మాతలు ఇలా వరుసగా విడుదల చేస్తున్నారు. తేజూ, వరుణ్‌ మరియు చరణ్‌, బన్నీల వార్‌లో ఎవరిది పై చేయి అయ్యేనో చూడాలి.