విశాఖ ల్యాండ్ స్కామ్ కు వైసీపీ లింకు..?

YCP Party link to Visakhapatnam scam

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

YCP Party Link To Visakhapatnam Scam

విశాఖలో భూకుంభకోణం పది రోజులుగా చర్చనీయాంశమైంది. అంతకు రెండు నెలల ముందే బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు పెందుర్తి భూముల విషయాన్ని ప్రస్తావించారు. చాలా మంది ల్యాండ్ స్కామ్ పై గొంతెత్తారు. కానీ వీరంతా చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెట్టారు. అసలు భూములు భోంచేసిందెవరో అందరికీ తెలుసు. సరే సీఎం కాబట్టి బాబును తిట్టారనుకుందాం. మరి అసలు ఆరోపణలు వచ్చిన మంత్రిని ప్రతిపక్షం ఎందుకు టచ్ చేయడం లేదని వైసీపీ కార్యకర్తలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడి సామాజిక వర్గం, సదరు మంత్రి సామాజిక వర్గం, బొత్స సామాజిక వర్గం ఒకటే కావడంతో.. ఆయన్ను లైట్ తీసుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది. కులానికి ప్రాధాన్యత ఇస్తూ.. పార్టీకి నష్టం చేస్తే ఇక పార్టీని దేవుడు కూడా కాపాడలేడని వైసీపీ కార్యకర్తలు మథనపడుతున్నారు. ఇలాంటి పనికిమాలిన స్కెచ్చులతోనే గతంలో విజయమ్మను ఓడించారని మండిపడుతున్నారు.

అసలు ప్రధాన ప్రతిపక్షంగా తీవ్రస్థాయిలో ఫెయిలైన వైసీపీ.. ఒక్క ల్యాండ్ స్కామ్ విషయాన్నైనా అందిపుచ్చుకుందిలే అనుకుంటే.. ఇక్కడ కూడా పార్టీకి నష్టం చే్తున్నారని స్థానిక కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీలు మారే జంపింగ్ జపాంగ్ లకు అవకాశాలిస్తున్న జగన్.. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పట్టించుకోవడం లేదు. ఇలాగే చేస్తే.. 2019లో కూడా అధికారం కలేనని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని వార్తలు :

బీజేపీ దెబ్బకు కాంగ్రెస్, సీపీఎం డీలా