బాబోయ్‌ 40 కోట్లా.. ఇది నిజం అయితే రికార్డే

Bellamkonda Srinivas sakshyam movie nizam rights

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, శ్రీవాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘సాక్ష్యం’. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన విషయం తెల్సిందే. విడుదలకు సిద్దం అయిన ఈ చిత్రం టీజర్‌ మరియు ట్రైలర్స్‌ భారీగా ఉండి సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఎంత భారీగా ఉన్నా కూడా ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలకు కలిపి 20 నుండి 25 కోట్ల మేరకు కొనుగోలు చేసి ఉంటారు. కాని చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం ఈ చిత్రం అన్ని ఏరియాల్లో కలిపి ఏకంగా 40 కోట్ల బిజినెస్‌ చేసినట్లుగా చెబుతున్నారు. ఇతర రైట్స్‌ ద్వారా మరో 10 కోట్లు నిర్మాత ఖాతాలో పడ్డట్లుగా ప్రచారం చేస్తున్నారు. అంటే మొత్తం ఈ చిత్రం 50 కోట్ల బిజినెస్‌ చేసినట్లుగా చెబుతున్నారు.

ఒక చిత్రం 50 కోట్ల బిజినెస్‌ చేయాలి అంటే స్టార్‌ హీరో అయ్యి ఉండాలి. ఒక సాదా సీదా అయితే బిజినెస్‌ 25 కోట్లను మించదు. కాని ఈ చిత్రం 50 కోట్లు దాటింది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యుల ప్రచారం చేయడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దిల్‌రాజు ఈ చిత్రం నైజాం రైట్స్‌ను ఏకంగా 7.5 కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది. దాంతో ఇతర ఏరియాల్లో భారీ ఎత్తున చిత్రం అమ్ముడు పోయింది. మొత్తానికి ‘సాక్ష్యం’ మూవీ 40 కోట్ల థియేట్రికల్‌ రైట్స్‌ అంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ 40 కోట్ల బిజినెస్‌ చేస్తే మాత్రం బెల్లంకొండ శ్రీనివాస్‌ చిత్రం రికార్డు సాధించినట్లే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతుంది.