ఆందోళనలో ఛార్మి.. హాజరు అయ్యేది అనుమానమేనా?

charmi might not be attended to interrogation about on drug case

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డ్రగ్స్‌ వ్యవహారంలో సిట్‌ ముందు నేడు పూరి జగన్నాధ్‌ హాజరు అయ్యి విచారణ ఎదుర్కొన్న విషయం తెల్సిందే. పూరి నుండి పలు కీలక విషయాలను సిట్‌ అధికారులు రాబట్టారు. ఇప్పుడు ఛార్మి వంతు వచ్చింది. సిట్‌ ముందు ఆమె హాజరు కానుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అనారోగ్య కారణాలు చూపించి విచారణకు దూరంగా ఉండే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోనే ఉందని, ఆమె నోటీసులు అందుకున్న కారణంగా విచారణకు సహకరించాల్సిందే అంటూ సిట్‌ అధికారులు కోరుతున్నారు. 

ఇటీవల ఛార్మి సోషల్‌ మీడియాలో వింత వింత వ్యాఖ్యలు చేస్తూ ఉంది. వేదాంతంతో కూడిన మాటలు మాట్లాడుతూ తనకు ఆ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తుంది. డ్రగ్స్‌ వ్యవహారంలో ఛార్మి పాత్ర ఉందని, ఆమె డ్రగ్స్‌ తీసుకోవడంతో పాటు, కెల్విన్‌ సాయంతో డ్రగ్స్‌ను టాలీవుడ్‌లో పలువురు సెలబ్రెటీలకు అందించేది అంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఛార్మి విచారణకు హాజరు అయితే సిట్‌ అధికారులు ఆమె నుండి కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉంది. ఛార్మికి డ్రగ్స్‌ అలవాటు ఉందా, ఆమె ఎవరి నుండి డ్రగ్స్‌ తీసుకుంటుంది, పూరికి సంబంధించిన కొన్ని విషయాలను మరియు నోటీసులు పొందిన ఇతరుతో ఏదైనా సంబంధం ఉందా అంటూ సిట్‌ అధికారులు ఆమెను ప్రశ్నించే అధికారం ఉంది.

మరిన్ని వార్తలు 

షాక్‌ : ‘నిన్నుకోరి’ 50 కోట్లు

పూరి విచారణ పూర్తి.. సిట్‌ నిర్ణయం ఏంటి?

రాజుగారిగదిని నాగ్‌ బాహుబలి స్థాయిలో ఉండాలంటున్నాడు