పూరి విచారణ పూర్తి.. సిట్‌ నిర్ణయం ఏంటి?

puri jagannadh interrogation finished about on drug case

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన దర్శకుడు పూరి జగన్నాధ్‌ను సిట్‌ అధికారులు నేడు ఉదయం నుండి సాయంత్రం వరకు విచారించారు. డ్రగ్స్‌ తీసుకున్నారా, కెల్విన్‌ ఎలా పరిచయం, డ్రగ్స్‌ ఎవరికి మీరు చేరవేసేవారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం అయిన విచారణ సాయంత్రం వరకు సాగింది. మద్యలో గంట లంచ్‌ విరామం తీసుకుని మళ్లీ పూరిని అధికారులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. రోజంతా కూడా మీడియా హడావుడి అక్కడ కనిపించింది. పూరి ఇంటి నుండి బయలుజేరిన్నప్పటి నుండి మీడియా ఆయన్ను వెంట వచ్చింది.

పూరి తన తమ్ముడు సాయి రామ్‌ శంకర్‌ మరియు తనయుడు ఆకాష్‌తో సిట్‌ ఆఫీస్‌కు వెళ్లాడు. అక్కడ పూరికి ముందు నుండి చెప్పినట్లుగా వీఐపీ గౌరవం ఇచ్చాడు. పూరితో పోలీసు అధికారులు మర్యాదపూర్వకంగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. పలు ప్రశ్నలకు పూరి సమాధానం క్లుప్తంగా చెప్పాడు. కెల్విన్‌ విషయంలో కాస్త జాగ్రత్తగా ఆలోచించి సమాధానాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ‘జ్యోతిలక్ష్మి’ ఆడియో ఈవెంట్‌ సందర్బంగా కెల్విన్‌ పరిచయం అయ్యాడని, అంతుకు ముందు పరిచయం లేదని, ఆ ఆడియో వేడుక ఆర్గనైజేషన్‌ చేసినందుకు గాను అతడికి డబ్బులు ఇచ్చినట్లుగా పూరి చెబుతున్నాడు. తనకు డ్రగ్స్‌ అలవాటు లేదు అని మొదట చెప్పిన పూరి ఆ తర్వాత తాను అప్పుడప్పుడు డ్రగ్స్‌ను తీసుకున్నట్లుగా ఒప్పుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో ఇదంతా కామన్‌ అన్నట్లుగా పూరి చెప్పినట్లుగా తెలుస్తోంది. పూరిని సుదీర్ఘంగా విచారించిన సిట్‌ అధికారులు ఇప్పుడేం చేస్తారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది. ఇంకా విచారించే వారు ఉన్నారు కనుక అందరిని విచారించిన తర్వాత సిట్‌ ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు 

రాజుగారిగదిని నాగ్‌ బాహుబలి స్థాయిలో ఉండాలంటున్నాడు

చక్రిని చంపేసింది పూరినే..!!

బిగ్‌బాస్‌ హౌస్‌మెంట్స్‌ పారితోషికాలు ఎంతో తెలుసా?