జగన్ కు పెరుగుతున్న సినీ మద్దతు !

వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు సినిమా ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇటీవల నటులు పోసాని కృష్ణమురళి, కమెడియన్ పృధ్వీలు జగన్‌ను కలవగా తాజాగా సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు జగన్ కి తన మద్దతు తెలిపారు. ఇవాళ తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలోని సోమేశ్వరంలో ప్రతిపక్ష నేతను కలిశారు. ఆయనతో పాటూ కొద్ది దూరం పాదయాత్రలో పాల్గొన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన రావాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలని ఆయన ఆకాంక్షించారు… అనంతంర మాట్లాడుతూ… రాజన్న రాజ్యం రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు.

జగన్ కు పెరుగుతున్న సినీ మద్దతు ! - Telugu Bullet