నేడు సామర్లకోటలో పర్యటించనున్న సీఎం జగన్..

CM Jagan will visit Samarlakota today..
CM Jagan will visit Samarlakota today..

నేడు సామర్లకోటలో సీఎం వైఎస్‌ జగన్ పర్యటించనున్నారు. సామర్లకోట ఈటీసీ లేఅవుట్‌లో సామూహిక గృహప్రవేశాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగనుంది. ఈ సందర్బంగా పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 5 లక్షల ఇళ్లు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇవాళ పేదల చేతికి ఇళ్లు అందించనున్నారు.

ఈ లెక్కన ప్రతి మహిళ చేతికి రూ.15 లక్షల విలువైన స్థిరాస్తి అందించనున్నారు. ఇక ఇవాళ సామర్లకోటలో ఈ ఇళ్ల ప్రారంభోత్సవం ఉండనుంది. అక్కడ 2 వేలకు పైగా ఇళ్లల్లో గృహప్రవేశాలు జరుగనున్నాయి. ఇక ఈ సందర్బంగా సామర్లకోట ప్రభుత్వ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్… ప్రతిపక్షాలకు కూడా కౌంటర్ ఇవ్వనున్నాడు. సామూహిక గృహప్రవేశాల ప్రారంభోత్సవ కార్యక్రమం తరుణం లో లబ్ది దారులు హర్షం వ్యాఙ్ఖతం చేస్తున్నారు.