ఫేక్ సర్వేలు: అర్థం కానీ, దిక్కుతోచని స్థితిలో టీడీపీ..!

Fake Surveys: Meaning but TDP in disorientation..!
Fake Surveys: Meaning but TDP in disorientation..!

అసలే జగన్ దెబ్బకు తెలుగుదేశం పార్టీ పరిస్తితి అధఃపాతాళానికి పడిపోయింది. వరుసగా టి‌డి‌పికి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. రాష్ట్రం జగన్ పాలనలో అభివృద్ధి పథంలో దూసుకెళుతుందని, అటు వైసీపీ కూడా తిరుగులేని ప్రజాభిమానాన్ని చూపిస్తుంది. కానీ టి‌డి‌పి పరిస్థితి ఇంకా దిగజారుతూనే ఉంది. ఇక స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యి..జైలు పాలయ్యారు. ఆయన ప్రస్తుతం జైలులోనే ఉన్నారు. ఈ క్రమంలో టి‌డి‌పి నడిపించే నాయకుడు లేక మరింత ఇబ్బందుల్లోకి వెళ్తుంది.

నాయకులు సైలెంట్ అయ్యారు..నడిపించే నాయకుడు లేక కేడర్ దిక్కులు చూస్తుంది. అంటే ఇంకా టి‌డి‌పి పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కానీ టి‌డి‌పిపైన ప్రజల్లో సానుభూతి, మద్ధతు పెరిగాయని బాబు భజనపరులు, సొంత మీడియా హైప్ ఇస్తుంది. ఇది మాటల్లో తప్ప చేతల్లో లేదు. అందుకే ప్రజలు నమ్మడం లేదని, దీంతో టి‌డి‌పి సర్వేల రూపంలో ఆట మొదలుపెట్టింది. అదిగో టి‌డి‌పి బలం పెరిగిపోయిందని కొన్ని ఫేక్ సర్వేలు వదులుతున్నారు. ఇప్పటికే ఓ సర్వే టి‌డి‌పి అధికారంలోకి వచ్చేస్తుందని హల్చల్ చేసింది.

లోకల్ సర్వే నమ్మకపోవడంతో జాతీయ సర్వే పేరుతో కొత్త రాజకీయానికి తెరలేపారు. అది ఏంటంటే ఇండియా టీవీ-సి‌ఎన్‌ఎక్స్ పేరిట విడుదలైన సర్వేలో వైసీపీ 46 శాతం ఓట్లతో 15 ఎంపీ సీట్లు..టి‌డి‌పి 42 శాతం ఓట్లతో 10 సీట్లు వస్తాయని సర్వే చెప్పిందని టి‌డి‌పి నేతలు చెప్పుకుంటున్నారు. అయితే అటు జాతీయ స్థాయిలో ఏ సర్వే చూసిన వైసీపీకి 25కి 25 ఎంపీ సీట్లు గెలుస్తుందని సర్వేలు వస్తున్నాయి.

రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. అసలు టి‌డి‌పికి ఉన్న ముగ్గురు ఎంపీలు తప్ప మిగిలిన పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయడానికి అభ్యర్ధులే లేరు. అటు అసెంబ్లీ స్థానాల్లో సరిగ్గా ఇంచార్జ్‌లు కూడా లేరు. ఎక్కడా చూసిన జగన్ గాలి ఎదురుకోలేమని తెలుగు తమ్ముళ్ళు చేతులెత్తేస్తున్నారు. కానీ ఇలాంటి ఫేక్ సర్వేలు వేసి సైకిల్‌కు జాకీలు వేసి లేపేందుకు టి‌డి‌పి భజనపరులు చూస్తున్నారు.