బాహుబలి టీంకు ఆమె ఎందుకు క్షమాపణలు చెప్పింది?

gowthami Sorry to SS Rajamouli and Baahubali 2 Movie Team

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ రెండు పార్ట్‌లు కూడా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా బాహుబలి 2 కనీవినీ ఎరుగని రీతిలో భారీ వసూళ్లు సాధించింది. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులు సృష్టించింది. దాదాపు 1700 కోట్లు వసూళ్లు చేసిన బాహుబలి సినిమా గురించి దేశంలో ప్రతి ఒక్కరు చర్చించుకున్నారు. అదే సమయంలో బాహుబలిని చూశారు. అయితే కమల్‌తో మొన్నటి వరకు సహజీవనం సాగించిన గౌతమి మాత్రం ‘బాహుబలి 2’ని చూడలేక పోయిందట. 

తాజాగా ఒకానొక సందర్బంగా ‘బాహుబలి 2’ చిత్రాన్ని తాను ఇప్పటి వరకు చూడలేక పోయాను. ఈ విషయానికి చిత్ర యూనిట్‌ సభ్యులకు క్షమాపణలు చెబుతున్నాను అంది. తన కూతురుకు పరీక్షలు జరుగుతున్న కారణంగా సినిమాలకు వెళ్లే పరిస్థితి లేదని ఆమె చెప్పుకొచ్చింది. మొదటి నుండి థియేటర్లలో సినిమాలు చూసే అలవాటు తక్కువ అని, అలాంటి తాను ‘బాహుబలి 2’ చిత్రాన్ని థియేటర్‌లో చూడాలని కోరుకుంటున్నాను. త్వరలోనే చూస్తాను అని ఆశిస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది. బాహుబలి సినిమా గురించి తాను విన్నాను అని, ఇప్పటి వరకు ఉన్న ఇండియన్‌ సినిమా స్థాయిని బాహుబలి పెంచేసిందని ఆమె చెప్పుకొచ్చింది. ఇలాంటి చిత్రాన్ని అందించిన చిత్ర యూనిట్‌ సభ్యులకు శుభాకాంక్షలు అందజేయడం జరిగింది.

మరిన్ని వార్తలు

బాహుబలి టీంకు ఆమె ఎందుకు క్షమాపణలు చెప్పింది? - Telugu Bullet