మంచు లక్ష్మి సాహస యాత్ర సక్సెస్‌

manchu-lakshmi-successfully-completed-manasarovar-yatra

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మోహన్‌బాబు నట వారసురాలిగా తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ మంచు లక్ష్మి ఎన్నో సాహసోపేతమైన పాత్రలు చేసింది. ఎన్నో రంగాల్లో తన ప్రావిణ్యంను కనబర్చి తండ్రికి తగ్గ తనయగా గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో సార్లు తండ్రికి ఆమె మంచి పేరు తీసుకు వచ్చింది. ఉత్తమ నటిగా, ఉత్తమ బుల్లి తెర హోస్ట్‌గా, మంచి వ్యాపారవేత్తగా, ఒక తల్లిగా ఇలా మంచు లక్ష్మి జీవితాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఇటీవల ఈమె కొత్త సినిమా ప్రారంభం అయ్యింది. సినిమాలు, వ్యాపారం ఇలా అన్ని రకాలుగా ఎంతో బిజీగా ఉన్న ఈ అమ్మడు తాజాగా సాహసోపేతమైన మానససరోవర యాత్రను చేసి విజయవంతంగా పూర్తి చేసింది.

తాజాగా ఈ విషయాన్ని మోహన్‌బాబు చెప్పుకొచ్చాడు. తన కుమార్తె లక్ష్మి ప్రసన్న మానస సరోవర యాత్రను విజయవంతంగా పూర్తి చేసిందని, ఆ కైలాసనాధుని దర్శించుకుని, ఆశీస్సులను పొందింది, వాట్సప్‌ లైవ్‌లో నాక్కూడా ఈశ్వరుడిని దర్శనభాగ్యం కలిగించి, నా జీవితం ధన్యం చేసింది. ఆ పరమ శివుడు అందరిని చల్లగా చూడాలని కోరుకుంటున్నా అంటూ మోహన్‌బాబు ట్వీట్‌ చేశాడు. మంచు లక్ష్మి సాగించిన అద్బుతమైన సాహస యాత్రను సినీ ప్రముఖులు సైతం మెచ్చుకుంటున్నారు.

మరిన్ని వార్తలు:

జైలవ‌కుశ ట్రైల‌ర్ కు భారీ రెస్పాన్స్

ఎన్టీఆర్‌ను చూసి లక్ష్మీ ప్రణతి భయపడిన సందర్బం

బాబోయ్‌.. ఏంటి ఈ కాంబినేషన్‌?