అలా చేస్తేనే ‘ఎన్టీఆర్‌’ అభిమానులకు సంతృప్తి…?

NTR Biopic First Part Release On Sankranthi

సినీ, రాజకీయ దిగ్గజం నందమూరి తారకరామారావు బయోపిక్‌ ‘క్రిష్‌’ దర్శకత్వంలో చకాచకా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో అన్నగారి పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నాడు. నారా చంద్రబాబు పాత్రలో రానా దగ్గుబాటి, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్‌, శ్రీదేవి పాత్రలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కనిపించబోతున్నారు. తారాగాణం పెరిగిపోతుండడంతో అభిమానుల్లో అంచనాలు కూడా తారా స్థాయికి చేరాయి. క్రిష్‌ ఈ చిత్రాన్ని చాలా స్పెషల్‌గా తీసుకున్నాడు. సినీ, రాజకీయ రంగంలో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ కోసం యూనిట్‌ సభ్యులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

nrt

‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ అనగానే మొదట్లో రెండు భాగాలుగా రాబోతుంది అనే టాక్‌ వచ్చింది. కానీ ఆ తర్వాత చిత్ర యూనిట్‌ నుండి ఏ విధమైన స్పందన రాలేదు. ‘ఎన్టీఆర్‌’ కు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఈ చిత్రాన్ని చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని కేవలం రెండున్నర గంటల్లో పూర్తి చేస్తే అభిమానులు అసంతృప్తికి గురవుతారు కాబట్టి రెండు భాగాలుగా తెరకెక్కించే విధంగా చిత్ర యూనిట్‌ నిర్ణయించుకుంది.

ntr-movies

తాజాగా క్రిష్‌ మరియు బాలయ్య బాబు ఈ విషయమై ఒక క్లారిటీకి వచ్చారు. అన్నగారి సినిమా అనగానే ఆంచనాలు భారీగా ఉంటాయి కాబట్టి ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ‘ఎన్టీఆర్‌’ జీవితంలోని కీలక ఘట్టాలను అన్నీ తెరకెక్కించాలని నిర్ణయం తీసుకున్నారు. మొదటి పార్ట్ రాబోయే సంక్రాంతి కి రావడం మాత్రం ఖాయం.

ntr-movie-rana