ఫిదా ముందు నిలువలేక పోతున్నాడు

fidaa-movie-effect-goes-to-gowthamnandha-movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగా హీరో వరుణ్‌ తేజ్‌, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ‘ఫిదా’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద వసూళ్లతో సందడి చేస్తోంది. వారం రోజులు పూర్తి అయిన తర్వాత కూడా సినిమా మంచి వసూళ్లను రాబడుతూనే ఉంది. ‘ఫిదా’ విడుదలైన వారం రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు గోపీచంద్‌ ‘గౌతమ్‌నంద’ చిత్రంతో వచ్చాడు. సంపత్‌నంది దర్శకత్వంలో తెరకెక్కిన ‘గౌతమ్‌నంద’కు ప్రేక్షకుల నుండి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. కాని ‘ఫిదా’ సినిమాకే ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్‌ మక్కువ చూపుతున్నారు. దాంతో ‘గౌతమ్‌నంద’కు కలెక్షన్స్‌ అంతగా రావడం లేదు.

‘ఫిదా’ చిత్రంను మల్టీప్లెక్స్‌ ప్రేక్షకులతో పాటు మాస్‌ ఆడియన్స్‌ కూడా ఆధరిస్తున్నారు. రెండవ వారంలో కూడా ఫిదా చిత్రాన్ని ప్రేక్షకులు ఆధరిస్తున్న నేపథ్యంలో ‘గౌతమ్‌నంద’ చిత్రానికి ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడం లేదు. సినిమాపై అంచనాలు భారీగా వచ్చిన కారణంగా అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తానికి ఈ సినిమాను కొనుగోలు చేయడం జరిగింది. దాంతో ఇప్పుడు వారు తీవ్ర గందరగోళంలో ఉన్నారు. ‘ఫిదా’ కారణంగా భారీ నష్టాలు తప్పేలాలేవు అని వారు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు:

జానకి మూవీలో బికినీతో ప్రగ్యా రచ్చ

ఇద్దరిలో ఎవరు ఎలిమినేషన్‌?

రవితేజ ఫ్యాన్స్‌ రచ్చరచ్చ