బిగ్‌బాస్‌ హౌస్‌ నుండి మొదట బయటకు వచ్చేదెవరు?

NTR big Boss telugu show Jyothi or Kathi Mahesh will be eliminate

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బిగ్‌బాస్‌ షో లాంచనంగా ప్రారంభం అయ్యింది. ఎన్టీఆర్‌ బిగ్‌బాస్‌ షోను లాంచనంగా ప్రారంభించి 14 మంది పార్టిసిపెంట్లను హౌస్‌లో చేర్చడం జరిగింది. ఆ 14 మంది పార్టిసిపెంట్లలో వారంలో ఒక్కరు చొప్పున బయటకు వచ్చేయనున్నారు. మొదటి వారంలో సంపూ కెప్టెన్‌ కనుక సంపూర్నేష్‌బాబుకు మొదటి వారంలో ఎలిమినేషన్‌ లేనట్లే. దాంతో 13 మంది హౌస్‌మెంట్స్‌లో ఒక్కరు ఈ శనివారం ఎలిమినేట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ ఒక్కరు ఎవరు అనే విషయంపై అప్పుడే తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

మొదటి ఎపిసోడ్‌ను బట్టి చూస్తుంటే జ్యోతి లేదా మహేష్‌ కత్తిలో ఒక్కరు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొదటి వారంలోనే వీరిద్దరిలో ఒకరు బయటకు రావడం ఖాయంగా కనిపిస్తుంది. జ్యోతి కాస్త ఓవర్‌గా బిహేవ్‌ చేయడంతో పాటు, అందరితో రూడ్‌గా ప్రవర్తిస్తుంది. ఆమె కాస్త ఓవర్‌గా యాక్టింగ్‌ చేస్తున్నట్లుగా అనిపిస్తుందని పార్టిసిపెంట్లు బిగ్‌బాస్‌తో చెప్పుకొచ్చారు. ఇక మహేష్‌ కత్తి కూడా బిగ్‌బాస్‌ షోకు సెట్‌ అవ్వడు అని పార్టిసిపెంట్లు భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఏ పని చేయకుండా, ఊరికే కూర్చోవడంతో పాటు, అందరిలో కలిసి పోలేక పోతున్నాడు. అందరు సెలబ్రెటీలు అవ్వడం, ఆయన మాత్రం పెద్దగా సెలబ్రెటీ కాకపోవడంతో ప్రేక్షకుల కూడా ఆయన్ను కోరుకోవడం లేదు. దాంతో మహేష్‌ కత్తికి ఈ వారం బయటకు వచ్చే ఛాన్స్‌ ఎక్కువ ఉంది. వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారు లేదా వీరిద్దరు కాకుండా మరెవ్వరైనా ఎలిమినేట్‌ అవుతారా అనేది చూడాలి.

మరిన్ని వార్తలు

సాయి పల్లవి కోసమైనా చూడాలనిపిస్తుంది

చరణ్‌కు మరే దర్శకుడు దొరకలేదా?

నాగ్‌, నాని మల్టీస్టారర్‌ మూవీ..