‘సాహో’ గురించి ఆసక్తికర విషయం

interesting news on saaho movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘బాహుబలి’ చిత్రం తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న సినిమాపై ప్రేక్షకులతో పాటు టాలీవుడ్‌, బాలీవుడ్‌ మరియు కోలీవుడ్‌ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. తెలుగులోనే కాకుండా ప్రభాస్‌ కొత్త చిత్రం ‘సాహో’ను తమిళం మరియు హిందీల్లో కూడా విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌లో వంశీ మరియు ప్రమోద్‌లు సుజీత్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుందని, విజువల్‌ ఒండర్‌గా సినిమా ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. 

ఇక సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. సినిమా కథ టైంలో ప్రయాణించడంతో ముడి పడి ఉంటుందని తెలుస్తోంది. చాలా సంవత్సరాల క్రితం బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాస్‌రావు దర్శకత్వంలో వచ్చిన ‘ఆదిత్య 369’ చిత్ర కథను పోలి ఉంటుందనే చర్చ జరుతుంది. కథలో భాగంగా భవిష్యత్తులోకి వెళ్లడం జరుగుతుందని, అక్కడ అత్యాధునిక టెక్నాలజీని వాడటం జరుగుతుందని సమాచారం అందుతుంది. తెలుగు ప్రేక్షకులు ఈ కొత్త తరహా కథను తప్పకుండా ఆధరిస్తారనే నమ్మకం ఉందని నిర్మాతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు ఈ సినిమా ‘మగధీర’ కథ తరహాలో ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ‘సాహో’ కథ చాలా విభిన్నంగా ఉంటుందని మాత్రం అనిపిస్తుంది. ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభం అయిన ఈ సినిమాను వచ్చే సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

మరిన్ని వార్తలు:

‘నేనే రాజు నేనే మంత్రి’ కొత్త తరహా ప్రమోషన్స్‌

తెలుగు సినీ పరిశ్రమ పరువు తీశారు : వర్మ

రెజీనా ఇక సర్దేసుకోవాల్సిందే

‘సాహో’ గురించి ఆసక్తికర విషయం - Telugu Bullet