నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్ బాబు, శ్రీయ కలయికలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ‘వీర భోగ వసంత రాయలు’. నూతన దర్శకుడు ఇంద్రసేన ఆర్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 26 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల అవుతుంది. ఈ సందర్భాంగా ఈ చిత్ర ట్రైలర్ ను డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేశారు. వైవిధ్యమైన కథ కథనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎవరు ఊహించని విధంగా డిఫరెంట్ గా ఉంటుందని , తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోందని చిత్ర యూనిట్ చెపుతున్నారు. క్రైమ్ డ్రామాగా థ్రిల్లర్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి మార్క్ కే రాబిన్ సంగీతం సమకూరుస్తుండగా, బాబా క్రియేషన్స్ పతాకంపై, ఎంవికె రెడ్డి గారి సమర్పణలో అప్పారావు బెల్లాన నిర్మిస్తున్నారు. కొద్ది సేపటి క్రితమే విడుదలయిన ట్రైలర్ మీరు కూడా చూసెయ్యండి మరి.
ఆశ, అత్యాశల నేపథ్యంలో రూపొందిన ‘చతురంగ వేట్టై’ చిత్రానికి తమిళ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడీ చిత్రం తెలుగులో రీమేక్ అయి విడుదలకు సిద్దం అయ్యింది. అభిషేక్ ఫిలిమ్స్ అధినేత రమేష్ పిళ్లై ఈ చిత్రానికి నిర్మాత. గోపీగణేష్ పట్టాభి దర్శకుడు. ‘జ్యోతిలక్ష్మి’ చిత్ర ఫేమ్ సత్యదేవ్ హీరోగా నటించారు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నందితా శ్వేత ఇందులో నాయిక. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘జ్యోతిలక్ష్మి’ సినిమాతో హీరోగా పరిచయమైన సత్యదేవ్ అంతకు ముందు ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు’ ‘అత్తారింటికి దారేది’ వంటి సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసాడు. ఇక పోయినేడాది రానా హీరోగా నటించిన ‘ఘాజీ’లో ఇంపార్టెంట్ క్యారెక్టరే చేసాడు. తాజాగా ఆయన బ్లఫ్ మాస్టర్ సినిమా టీజర్ విడుదల అయింది. మోసాల నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ మీద మీరు కూడా ఒక లుక్ వేసెయ్యండి మరి.
గీతాంజలి, త్రిపుర’ వంటి సక్సెస్ ఫుల్ లేడీ ఓరియంటెడ్ మూవీస్ తెరకెక్కించిన రాజకిరణ్ ప్రస్తుతం మరో లేడీ ఓరియంటెడ్ మూవీ తెరకెక్కిస్తున్నారు. అదే ‘విశ్వామిత్ర’. మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రొస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ మూవీ టీజర్ నుకొద్దిసేపటి క్రితం విడుదల చేసారు.
నందితా ఇందులో కథానాయికగా నటిస్తోంది. అమెరికాలో జరిగిన నిజ జీవిత సంఘటన ఆధారంగా థ్రిల్లర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నందిత రాజ్ తో పాటు సత్యం రాజ్, విద్యుల్లేఖ రామన్, అశుతోష్ రానాలు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి చిత్ర దర్శకుడు ఆకెళ్ల వంశీకృష్ణ మాటలు రాస్తుండటం విశేషం. అలాగే ఆరెక్స్ 100 సినీ రచయిత తాజుద్దీన్ సహా డైలాగ్ రైటర్ గా పనిచేస్తున్నారు. ఆసక్తి రేపుతున్న ఈ టీజర్ మీరు కూడా చూసెయ్యండి మరి.
కొన్నాళ్లుగా సరైన హిట్స్ లేక మాంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న రామ్ పోతినేని ప్రస్తుతం ‘హలో గురు ప్రేమకోసమే’ అంటూ మన ముందుకు వస్తున్నాడు. నేను లోకల్ ఫేం త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలుగా.. రూపొందుతోన్న లవ్ ఎంటర్టైనర్ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్రాజ్, సురేష్, పోసాని కృష్ణ మురళి కీలకపాత్రలో నటిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్స్గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలోని పాటలు నిన్న మార్కెట్లోకి డైరెక్ట్గా విడుదలయ్యాయి.
అక్టోబర్ 13న వైజాగ్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ను నిర్వహించనున్నారు. అలాగే దసరా సందర్భంగా అక్టోబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని రేపుతున్నాయి. తన లవ్ సక్సెస్ అయ్యేందుకు రామ్ ఎన్ని ఎత్తుగడలు వేస్తున్నాడనేది ట్రైలర్ని బట్టి అర్ధమవుతుంది. రామ్ కెరీర్లో ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుందని టీం భావిస్తుంది. ప్రస్తుతం మూవీకి సంబంధించి జోరుగా ప్రమోషన్స్ జరుగుతుండగా, ఈ సీజన్ లో విడుదల కానున్న సినిమాలని తట్టుకొని ఈ మూవీ ఎంత విజయం సాధిస్తుందనేది చూడాలి.
యూత్ను ఆకట్టుకునే విధంగా ప్రేమ కథలను రూపొందించడంలో హను రాఘవపూడి దిట్ట అనే విషయం అందరికి తెల్సిందే. ఈయన శర్వానంద్, సాయిప్లవిల కాంభోలో ‘పడి పడి లేచే మనసు’ చిత్రాన్ని రూపొందించాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. శర్వానంద్కు విభిన్నమైన కథలను ఎంచుకుంటాడు అనే టాక్ ఉంది. ఇక సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా సహజంగా కనిపించి కుర్రకారుని కట్టి పడేసే అందం కలది. ఈ ఇద్దరి కాంభోలో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకులకు అంచనాలు లేకపోలేదు.
తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదల అయ్యింది. టీజర్లో సాయి పల్లవి మెడికోలాగా, శర్వానంద్ ఆమె వెంటపడడం, అందుకు సాయిపల్లవి క్లాస్ పీకడం చూపించారు. ఈ తరహా టీజర్ను చూసి కుర్రకారు ఊగిపోతున్నారు. ఒక్క టీజర్తోనే అంచనాలను అమాంతం పెంచేశారు. టీజర్ చూస్తుంటే సినిమా చూడాలనే కాంక్ష ఎక్కువుతుంది. యూత్ను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం రూపొందిందని అదే తరహాలో టీజర్ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఓవరాల్గా చూస్తుంటే టీజర్తోనే మెప్పిస్తున్న ‘పడి పడి లేచే మనసు’ సినిమాపై మనసు పడేలా చేస్తుంది.
తెలుగు తెరపై ప్రేమకథా చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుంది. ఈ కారణంగానే విభిన్నమైన ప్రేమకథా చిత్రాలు ఇక్కడి ప్రేక్షకులను ఎక్కువగా పలకరిస్తూ ఉంటాయి. అందులోనూ ఈ మద్య బోల్డ్ లవ్ అనే కాన్సెప్ట్ ఒకటి మొదలయ్యింది. ఈ నేపథ్యంలోనే ‘రథం’ పేరుతో మరో ప్రేమకథా చిత్రం రూపొందింది. గీతానంద్, చాందిని హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ను బట్టి ఇది గ్రామీణ నేపథ్యంలో కొనసాగే ప్రేమకథా చిత్రమని అర్థమవుతోంది. అమ్మాయి అబ్బాయి ప్రేమలో పడడం, వారి ప్రేమ శ్రుతిమించి పెద్దలు వారిని విడదీయడం, వాళ్లు పెద్దలను ఎదిరించడం నేపథ్యంలో ఈ ట్రైలర్ ను కట్ చేశారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. యూత్ కి ఈ సినిమా ఎంతవరకూ కనెక్ట్ అవుతుందో చూడాలి మరి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం అరవింద సమేత వీర రాఘవ . త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. తాజా ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన హాట్ భామ పూజా హెగ్డే నటించగా తెలుగమ్మాయి ఈషా రెబ్బా కీలక పాత్రలో నటించింది. దసరా కానుకగా ఈ నెల 11న ఈ మూవీ విడుదల కానుంది ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా అనగనగా సాంగ్ ప్రొమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆర్మాన్ మాలిక్ పాడిన ఈ పాటకి సిరివెన్నెల సీతారామ శాస్ర్తి సాహిత్యం అందించారు. తమన్ సంగీతం సమకూర్చారు. తాజాగా విడుదలైన ఈ సాంగ్ ప్రొమో మీద మీరు కూడా ఒక లుక్ వెయ్యండి మరి
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం విడుదలకు మరో వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రమోషన్ల జోరు పెంచారు. మంగళవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంటుకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ నెం.1లో ట్రెడింగ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్ తనయుడు అభయ్కు కూడా ఉండటం ఫ్యాన్స్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. తాజాగా విడుదలైన మేకింగ్ వీడియోలో ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్ కనిపించాడు. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా అభయ్ రామ్ యాక్షన్ చెప్పడం వీడియోలో కనిపిస్తోంది. ఈ సందర్భంగా త్రివిక్రమ్ అభయ్ను ఒళ్లో కూర్చోబెట్టుకుని కనిపించారు.
ఆ వీడియో మీద మీరు కూడా ఒక లుక్ వేసెయ్యండి మరి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన క్రేజీ మూవీ ‘అరవింద సమేత వీర రాఘవ’ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లోని హెచ్ఐసీసీ నోవోటెల్లో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకకు సుమ యాంకర్గా వ్యవహరిస్తున్నారు. ముందుగా ప్రకటించినట్టుగానే అరవింద సమేత వీర రాఘవ ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదల చేసారు. ఇప్పటికే విడుదల అయిన చిత్ర టీజర్ అంచనాలు రేపగా ఇప్పుడు ట్రైలర్ అంతకు మించి అనిపించేలా ఉంది. మీరు కూడా ఒక లుక్ వేసెయ్యండి మరి
దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా మణికర్ణిక. ఇప్పటికే పలు వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఈ సినిమా ఫైనల్గా రిలీజ్కు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల తేదీ జనవరి 26 గా నిర్ణయించగా ఈరోజు టీజర్ ను గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ చేశారు. బిగ్ బి అమితాబ్ వాయిస్ ఓవర్తో రూపొందించిన టీజర్ ఆసక్తికరంగా ఉంది. ఝాన్సీ లక్ష్మీ బాయ్ రాజనీతి, ధైర్య సాహసాలు ప్రతిబింభించేలా మణికర్ణిక సినిమాను రూపొందిస్తున్నారు.
కంగనా రనౌత్ ఝాన్సీ లక్ష్మీ బాయ్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. మేజర్ పార్ట్కు క్రిష్ దర్శకత్వం వహించగా చివర్లో కొన్ని సన్నివేశాలతో పాటు ప్యాచ్ వర్క్కు కంగనా దర్శకత్వం వహించారు. ఆ సమయంలో కంగన వ్యవహార శైలిపై ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు దర్శకురాలిగా కంగనా పేరునే టైటిల్స్లో వేస్తారన్న ప్రచారం జరిగినా టీజర్లో దర్శకుడిగా క్రిష్ పేరే కనిపించింది. కొద్ది సేపటి క్రితం విడుదల అయిన చిత్ర టీజర్ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేస్తోంది. ఝాన్సీ లక్ష్మి బాయిగా కంగనా చెలరేగి నటించింది అనే విషయం టీజర్ స్పష్టం చేస్తోంది. ఒక్క మాటలో చెపాలంటే టీజర్ అరాచకం. కంగనా అపర కాళికలా కనిపించింది.
సీనియర్ మోస్ట్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో, నూతన నటీనటులు సంజోష్, హర్షిత జంటగా నటించిన బేవర్స్ సినిమా ట్రైలర్ విడుదలైంది. రమేష్ చిప్పల అనే ఓ కొత్త దర్శకుడు రచించి, డైరెక్ట్ చేసిన ఈ సినిమాను పొన్నాల చందు, డా.ఎం.ఎస్. మూర్తి, ఎం అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బేవర్స్ సినిమాలో పాత్రల తీరుతెన్నులపై ఓ అవగాహన వచ్చేలా. “రాముడు లాంటివాడు పుట్టాలని పూజలు చేస్తే, రామ్ గోపాల్ వర్మ లాంటోడు పుట్టాడు” అనే డైలాగ్తో మేకర్స్ ఈ ట్రైలర్ని విడుదల చేశారు.
ట్రైలర్ చూస్తే తెలుగులో చాలాసార్లు చూసిన తండ్రీ కొడుకుల కథతోనే ఈ సినిమా తెరకెక్కినట్లు అనిపిస్తోంది. సమాజంలో గౌరవంగా బతికే తండ్రి బాధ్యత లేకుండా బేవర్సుగా తిరిగే కొడుకు ఇద్దరి మధ్య ఘర్షణ ఈ నేపథ్యంలో కామెడీ ఐతే ఒక పెద్ద సమస్య తలెత్తినపుడు ఆ కొడుకులో మార్పు వచ్చి తండ్రి కోసం నిలబడి పోరాడే కథతో ఈ సినిమా తెరకెక్కినట్లు కనిపిస్తోంది. ‘జ్యోతిలక్ష్మీ’ ‘లోఫర్’ లాంటి సినిమాలకు సంగీతం అందించిన సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి పని చేశాడు. అయితే, జీవితంలో ఏదో ఒకటి సాధించే వరకు ప్రతీ కొడుకు తండ్రి దృష్టిలో బేవర్స్గానే కనిపిస్తాడు అనే పాయింట్ చుట్టూ ఈ కథనాన్ని రాసుకున్నట్టు ట్రైలర్ చివర్లో వచ్చిన మరో డైలాగ్ చూస్తే అర్థమవుతోంది. మరి ఈ చిన్న సినిమా జనాల్ని ఏమేరకు థియేటర్లకు రప్పిస్తుందో చూడాలి. ఆలోచింపచేస్తున్న ఆ చిత్ర ట్రైలర్ మీరు కూడా చూసెయ్యండి మరి.
వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ప్రొడక్షన్ నెం.9గా నిర్మిస్తున్న కర్త క్రియ కర్మ సినిమా టైటిల్ ఫస్ట్ టీజర్ను విడుదల చేశారు. ‘వీకెండ్ లవ్’ ఫేం నాగు గవర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా వసంత్ సమీర్, సెహర్ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ఈరోజు ‘కర్త కర్మ క్రియ’ టీజర్ను విడుదల అయ్యింది. వసంత్ సమీర్, సెహర్, నూతన్ రాయ్, రవివర్మ, శ్రీహర్ష, జబర్దస్త్ రాంప్రసాద్, కాదంబరి కిరణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ సస్పెన్స్ పెంచేదిగా ఉంది. ఈ ఏడాది చిన్న సినిమాలు మంచి హిట్ లు అందుకోవడంతో ఈ సినిమా మీద కూడా అంచనాలు నెలకొన్నాయి. మీరూ ఈ సినిమా టీజర్ మీద ఒక లుక్ వేసెయ్యండి మరి…
అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ‘సవ్యసాచి’. ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారానే సినిమాలో ఏదో విశేషం ఉంది అనిపించిన చిత్ర యూనిట్ సినిమా విడుదలను మాత్రం బాగా ఆలస్యం చేసింది. ఈపాటికే విడుదలవ్వాల్సిన చిత్రం షూటింగ్ డిలే అవడంతో వెనుకబడిపోయింది.
ప్రస్తుతం చైతూ పూర్తి డేట్లు ఈ సినిమాకు కేటాయించడంతో షూటింగ్ ముగింపుకు చేరుకుంది. యూనిట్ సభ్యులు టీజర్ ను సిద్ధం చేశారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ఈ టీజర్ రిలీజ్ అయ్యింది. వానిషింగ్ ట్విన్ సిండ్రోం అనే కొత్త కాన్సెప్ట్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. మీరు కూడా టీజర్ మీద ఒక లుక్ వేసెయ్యండి మరి.
బాబోయ్.. ఏముంది అసలు… భారతదేశ చలనచిత్రాల్లోకి మరో పెద్ద సినిమా వచ్చి చేరబోతుంది. ఆ పోరాట సన్నివేశాలు, ఆ హంగామా, ఆ సెట్టింగులు, ఆ భారీ నిర్మాణాలు, ఒక్కోటి చూస్తుంటే ఎప్పుడు సినిమా వచ్చేస్తుందా అన్నట్టు ఉంది. అయితే, ఈ నవంబర్ 8కి సినిమా వస్తుందని లోగో రిలీజ్ చేసిన రోజే చెప్పేశారు. అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ ద్వయం అంటే అంచనాలు తార స్థాయికి చేరుకుంటున్నాయి. ఇద్దరూ కూడా భిన్న చిత్రాలు చేయడం సిద్ధ హస్తులు కాగా ఇప్పుడు ఆ ఇద్దరు కలిసే ఈ స్టొరీని సినిమా గా మన ముందుకి తీసుకు వస్తున్నారు. అలాగే, ఇండియా లో పేరున్న పెద్ద నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించడం కూడా అంచనాలను మరో స్థాయికి తీసుకువెళ్ళడంలో దోహదపడుతున్నాయ్. ఇంకా, కత్రిన కైఫ్, అలాగే దంగల్ సినిమా లో అమీర్ కి కూతురిగా నటించిన ఫాతిమా సనా షేక్ ఈ సినిమాలో ముఖ్యమయిన పాత్రలోనే నటిస్తుంది. తన పాత్ర నిడివి కూడా ఎక్కువే ఉన్నట్టు ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. ఇక, ధూమ్ సిరీస్, రావణ్ సినిమాలతో పేరు తెచ్చుకున్న దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య ఈ సినిమాకి దర్శకుడు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే, ఒక్కో ఫ్రేమ్ చాలా కళాత్మకంగా, చాలా రిచ్ గా కనిపిస్తుంది. ఈ సినిమా కథకి ఫిలిప్ మెడోస్ టేలర్ అనే రచయిత రాసిన “కన్ఫ్యూషన్స్ ఆఫ్ థగ్” అనే నవల ఆధారం. ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యం నెలకొన్న 19వ శతాబ్దంలో ఆజాద్ అని పిలవబడే ఒక దొంగల నాయకుడు బ్రిటిష్ వారికి సవాలుగా మారతాడు. అప్పటి ఆ కథే ఇప్పుడు కొన్ని కాల్పనిక అంశాలతో మన ముందుకి రాబోతుంది. ఆ పెద్ద పెద్ద ఓడలు, యుద్ధాలు, వారి ఆకారాలు, అన్ని కూడా చాలా కొత్తగా ఉన్నాయి. అదే విధంగా చూసే వాళ్ళని, మళ్ళీ ఒకసారి చూసేలా చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ సినిమా తెలుగు, తమిళ్ లో కూడా రాబోతుంది. దానికి గాను, అమితాబ్ మరియు అమీర్ లు తెలుగులోనూ, తమిళ్ లోను మాట్లాడిన వీడియోలను విడుదల చేశారు. అమితాబ్, అమీర్ లు అంటే దక్షిణాన చాలా మందికి ఇష్టమే. ఇక ఈ ఇద్దరు వస్తున్నారు, అలాగే ప్రమోషన్స్ తెలుగు, తమిళ్ లో చేస్తున్నారు అంటే అభిమానులు ఇంకా మురిసిపోతుంటారు.
నటీనటులు: అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్
రచయిత-దర్శకుడు: విజయ కృష్ణ ఆచార్య
నిర్మాత: ఆదిత్య చోప్రా
సంగీతం: అజయ్-అతుల్
నేపధ్య సంగీతం: జాన్ స్టీవర్ట్ ఎడురి
కేవలం బాలీవుడ్ చిత్రాలకు మాత్రమే పరిమితం అయిన బోల్డ్ కంటెంట్ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’. విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా సందీప్ వంగ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అర్జున్ రెడ్డి చిత్రంపై వివాదం కూడా రాజుకున్న విషయం తెల్సిందే. వివాదాన్ని రాజేసినా కూడా సినిమాకు మంచి వసూళ్లు మాత్రం సాధ్యం అయ్యాయి. అర్జున్ రెడ్డి టాలీవుడ్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. అలాంటి సినిమా ప్రస్తుతం హిందీ, తమిళం, కన్నడం, మలయాళంలో రీమేక్ అవుతుంది.
ఈ నాలుగు రీమేక్లలో మొదటగా తమిళంలో రూపొందుతున్న రీమేక్ ‘వర్మ’ రాబోతుంది. విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా ఈ చిత్రంతో పరిచయం కాబోతున్నాడు. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న బాలా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ‘వర్మ’ చిత్రం ఫస్ట్లుక్ మరియు టీజర్ను విడుదల చేయడం జరిగింది. అంతా భావించినట్లుగానే టీజర్ చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా పలు సీన్స్ అర్జున్ రెడ్డిని దించేసినట్లుగా అనిపిస్తున్నాయి. ముద్దు సీన్స్ ఈ చిత్రంలో కూడా లెక్కకు మించి ఉండబోతున్నట్లుగా అనిపిస్తుంది. హీరో పాత్ర తీరు మరియు హీరోయిన్ బాడీలాంగ్వేజ్ పూర్తిగా అర్జున్ రెడ్డిని పోలి ఉంది. మొత్తానికి అర్జున్ రెడ్డిని దించేసినట్లుగా ‘వర్మ’ టీజర్ ఉంది. మరి సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న మూవీ ‘అరవింద సమేత వీర రాఘవ’ పాటల సందడి మొదలైంది. ఇప్పటికే విడుదలై రెండు పాటలు టాప్ ట్రెండింగ్లో కొనసాగుతుండగా తాజాగా మిగిలిన సాంగ్స్ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. తమన్ సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రానికి చెందిన సెప్టెంబర్ 18న విడుదలైన ‘అనగనగనగా’ లవ్ సాంగ్ యూత్కి బాగా కనెక్ట్ అయ్యింది. నిన్న (సెప్టెంబర్ 19) విడుదలై ‘పెనిమిటి’ సాంగ్ యూట్యూబ్ ట్రెండింగ్లో కొనసాగుతోంది. ఈ రెండు పాటలకు సోషల్ మీడియాలో ఊహించని రెస్పాన్స్ రావడంతో మిగిలిన సాంగ్స్ను కొద్ది సేపటి క్రితమే విడుదల చేశారు. ఆ పాటలు మీరూ వినేయ్యండి మరి.
నాగార్జున నాని కథానాయకులుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ‘దేవదాస్’ అనే మల్తీస్తారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆకాంక్ష సింగ్, రష్మిక మందన కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా మరో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. “ఏమో ఏమో ఏమో మెరుపుతీగ ఎదురై నవ్విందేమో .. ఏమో ఏమో ఏమో వెలుగు వాగు నాలో పొంగిందేమో ..” అంటూ నాని .. రష్మిక మందనలపై ఈ సాంగ్ సాగుతోంది. ప్రేమలో పడిన కుర్రాడు .. ఆ ప్రియురాలిని తలచుకుంటూ పాడుకునే పాట ఇది. సిరివెన్నెల పద ప్రయోగాలతో మణిశర్మ సంగీతంతో సిద్ శ్రీరామ్ గాత్రంతో ఈ పాటను హృదయాలను బరువేక్కిస్తోంది. మరింకెందుకు ఆలస్యం మీరూ ఒక చెవి వేసెయ్యండి మరి
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న “అరవింద సమేత వీరరాఘవ” సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్లో వస్తున్న సంగతి తెలిసిందే. దసరా కానుకగా అక్టోబరు 13వ తేదీన విడుదలకానున్న ఈ సినిమా ఆడియోని సెప్టెంబర్ 20న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. ఇక కొద్ది రోజులుగా చిత్రానికి సంబంధించి ఒక్కో లిరికల్ సాంగ్ విడుదల చేస్తూ వస్తున్నారు. ఇటీవల విడుదలైన మొదటి సాంగ్లో పూజా హెగ్డే.. ఎన్టీఆర్ని చూసి టఫ్గా కనిపిస్తారు కానీ మాట వింటారు.. ఫర్లేదు అనే డైలాగ్ అభిమానులని అలరించింది. ఇక రెండో సాంగ్గా ‘పెనివిటి’ అంటూ సాగే పాటని నేటి సాయంత్రం 4.50ని.లకు విడుదల చేసారు. రాయలసీమ స్లాంగ్లో ఉన్న ఈ పాట మీరూ వినేయ్యండి మరి.
ఇంకా టైటిల్ పెట్టని అఖిల్ మూడవ సినిమా రూపొందుతోందన్న సంగతి తెలిసిందే. తొలిప్రేమ లాంటి హిట్ ఇచ్చిన వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. మూడో సినిమా టైటిల్ను ఈరోజు ప్రకటించింది చిత్రయూనిట్. చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నట్టుగా మిస్టర్ మజ్ను అనే టైటిల్నే ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో అఖిల్ ప్లేబాయ్గా కనిపించనున్నాడు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను ఈరోజు రిలీజ్ చేసారు. ‘దేన్నైతే మిస్ చేయకూడదో.. దాన్నే మిస్ అన్నారు’ అంటూ సాగుతున్న ఈ టీజర్ మీద మీరూ ఒక లుక్ వెయ్యండి మరి,
జూ.ఎన్టీయార్, త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఎంతమంది ఫాన్స్ ఆనందపడి ఉంటారో. జూ.ఎన్టీయార్ తెలుగు స్వచ్ఛమయిన ఉచ్ఛారణ, తెలుగు మీద తనకున్న పట్టు గురించి మనం కొత్తగా మాట్లడకునేది ఏమిలేదు. అలాగే, త్రివిక్రమ్ శ్రీనివాస్, మాటల మాంత్రికుడు అని ప్రతీ తెలుగు వాడి చేత పిలిపించుకున్న రచయిత, తెలుగు పదాలతో తనదైన శైలిలో మాటలు బాణాలు సంధించగలవారు. ఇలాంటి ఈ తెలుగు వాడి తెలిసిన హీరో అండ్ దర్శకుడు కలిస్తే ఆ అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాలా. తెలుగు భాష మురిసిపోయేలా, తెలుగు వాడు కేరింతలు కొట్టేలా సంభాషణలు ఉంటాయండంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి ఈ సినిమా టీజర్ ఏ స్థాయిలో ఆకట్టకుందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది. మొదటి సారిగా తమన్ త్రివిక్రమ్ సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నారు. కానీ, తమన్ అండ్ తారక్ కి ఇది 5th సినిమా. ఇక హీరోయిన్స్ విషయంకి వస్తే, పూజా హెగ్డే అండ్ ఈషా రెబ్బ తారక్ కి జోడిగా నటిస్తున్నారు. అలాగే, సునీల్ కూడా ఒక ప్రత్యేక పాత్రలో నటించడం విశేషం.
ఇక ఈ పాట విషయానికి వస్తే, తమన్ మ్యూజిక్, ఆర్మాన్ మాలిక్ స్వరం, సీతారామ శాస్త్రి గారి కలం నుండి జాలువారిన అక్షరాలు, పాటని మరో స్థాయికి తీసుకెళ్ళాయి. ఖచ్చితంగా ఇది అందరికీ నచ్చుతుందనే చెప్పాలి. అంతే కాకుండా, మాలిక్ ఫస్ట్ టైం తారక్ సాంగ్ ని పాడారు. ఇక చూసుకోండి…