న్యూస్ ఉంటే పట్టుకోవాలి.. లేదంటే లేని న్యూస్ కూడా క్రియేట్ చేయాలి. ఇక్కడ ప్రేమ న్యూసే.. పగ న్యూసే.. చావు న్యూసే.. చావకపోయినా న్యూసే ఇవి సుమంత్ హీరోగా నటించిన “ఇదం జగత్” టీజర్ లోని డైలాగ్ లు. ఈ దైల్గ్స్ వింటుంటేనే అసలేమాత్రం అంచనాలు లేని సినిమా కూడా అంచనాలు రేకెత్తిస్తోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ వైసిపి అధినేత జగన్ చేతుల మీదుగా టీజర్ విడుదలైంది. ఈ చిత్రంతో అనిల్ శ్రీకంఠం దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
ఈ మధ్య కాలంలో దాదాపు అందరు నవ దర్శకులు ఏదో ఛాన్స్ దొరికింది కదా అని సేఫ్ గేమ్ కాకుండా ఆసక్తికరమైన కథ, కథనంతో వస్తున్నారు.
ఇప్పుడు అనిల్ కూడా అదే దారిని ఎంచుకున్నాడు. టీజర్ చూసినపుడే “ఇదం జగత్” ఎలా ఉండబోతుందో అర్థం అయిపోతుంది. మళ్లీరావా సినిమా నుండి సుమంత్ కథల ఎంపికలో రాటుదేలినట్టు కనిపిస్తుంది. మళ్లీరావాతో ప్రశంసల దగ్గరే ఆగిన ఈ హీరో.. “ఇదం జగత్”తో కచ్చితంగా కమర్షియల్ హిట్ కూడా కొట్టేలా కనపడుతున్నాడు. సెప్టెంబర్లో ఈ చిత్రం విడుదల కానుంది. జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్తిగా మీడియా నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. అంజు కురియన్ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది. మొత్తానికి సుమంత్ ఆశలను “ఇదం జగత్” ఎంతవరకు తీరుస్తుందో చూడాలి.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్సకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `సైరా`. రామ్చరణ్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాలో పలు కీలకపాత్రల్లో వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులు కనిపించనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్ర టీజర్ను రేపు(బుధవారం) చిరు బర్త్ డే సందర్భంగా ఒకరోజు ముందే అంటే ఈరోజు ఉదయం 11:30 గంటలకు రిలీజ్ చేసింది చిత్రబృందం. సైరా చిత్రం టీజర్ రిలీజ్ ఈవెంట్ ప్రసాద్ ల్యాబ్స్లో జరుగుతోంది. టీజర్ ను మీరూ ఒక లుక్ వేసెయ్యండి మరి
నారా రోహిత్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చినా, పెద్దగా హడావుడి లేకుండా తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు రోహిత్. రోహిత్ సినిమా అంటే వైవిధ్యం కోసం పది చచ్చేవారికి విందు భోజనం లాంటిది అన్న మాట. మూస సినిమాలు చేసుకుంటూ పోకుండా ప్రతీ సినిమాలో వైవిద్య్హం కనపడేలా చుసుకంటాడు. తాజాగా మరో వెరైటీ కాన్సెప్ట్ సినిమాతో వస్తున్నాడు నారారోహిత్. ‘వీరభోగవసంతరాయలు’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో నారా రోహిత్తో పాటు సుధీర్బాబు, శ్రీవిష్ణు, శ్రియా శరణ్లు కూడా ఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో నటిస్తుండడం విశేషం. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలయ్యింది.
‘నాకు తెలుసు మీరు వాళ్ల రాక కోసం ఎన్ని పూజలు, వ్రతాలు చేస్తున్నారో అని…’ అంటూ నారారోహిత్, ఓ మీడియా సమావేశంలో చెబుతూ ఉండగా టీజర్ మొదలవుతుంది. చివర్లో ఓ ముసుగు వ్యక్తి గుర్రం మీద వస్తుంటాడు. అతనెవరు అనేది చెప్పకపోయినా, ఇంతకుముందు విడుదలయ్యిన ఫస్ట్ లుక్ పోస్టర్లను బట్టి చూస్తే, గుర్రం మీద స్వారీ చేసే వ్యక్తి శ్రీవిష్ణుయేనని ప్రేక్షకులకి యిట్టె అర్ధం అయిపోతుంది. టీజర్ సినిమా మీద అంచనాలు పెంచుతుండగా సినిమా ఇంకెన్ని సంచలనాలకి వేదిక కానుందో ? అనే అనుమానం రేకేత్తుతోంది. మీరూ ఒక లుక్ వేసెయ్యండి మరి.
ఈ టాలీవుడ్ కేమైంది ఎప్పుడు లేని విధంగా ఈ రొటీన్ కి భిన్నమైన స్టోరీలు ఏంటి అనిపిస్తోంది ఒక ఏడాది నుండి తెలుగు సినిమాలని గమనిస్తే. తాజాగా ‘హల్ చల్’ పేరుతో తెరకెక్కుతున్న సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఈ ఒక నిముషం పైన ఒక సెకండ్ నిడివి ఉన్న ఈ టీజర్ మైండ్ బ్లాంక్ అవడం ఖాయం. ‘హల్ చల్’ అనే మందు చుట్టూ అల్లుకున్న కధే ఇది, ఆ మందు తాగితే చావనివ్వదు.. అలా అని హాయిగా బతకనివ్వదు.
అది తాగితే ఏది నిజమో ఏది భ్రమో తెలుసుకోలేము.. ఇలాంటి వెరైటీ డ్రగ్ బ్లెండర్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్తో ‘హల్ చల్’ మూవీ టీజర్ సందడి చేస్తోంది.రుద్రాక్ష, ధన్య బాలకృష్ణ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర టీజర్ను శుక్రవారం విడుదలైంది. రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై నూతన నిర్మాత గణేష్ కొల్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీపతి కర్రి దర్శకుడు. మరి ఆ సినిమా టీజర్ మీరూ చుసేయ్యండి మరి
తెలుగులో చాన్నాళ్ళ క్రితమే సినిమాలు ఆపేసిన హీరోయిన్ సదా.. ఇప్పుడు ఓ బోల్డ్ క్యారెక్టర్తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అది కూడా తెలుగులో కాదండోయ్ తమిళంలో రానున్న ‘టార్చ్లైట్’ సినిమాలో ఆమె వేశ్య పాత్రలో కనిపించనుంది. 1990లో ఆంధ్రప్రదేశ్ – తమిళనాడు జాతీయ రహాదారిపై జరిగిన కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరో లీడ్ పాత్రలో రిత్విక కనిపిస్తోంది.
ఒకప్పుడు జాతీయ రహదారులపై ‘టార్చ్లైట్లు’తో విటులను వేశ్యలు ఆకర్షించే వారు, ఇప్పుడు అదే టైటిల్ మరియు ప్రధాన అంశంగా తీసుకుని ఈ సినిమా తెరకెక్కించారు. సినిమాకు తగినట్లే ఇందులో బోల్డ్ డైలాగులు ఉన్నాయి. ఈ సినిమాకు ప్రాంతీయ సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి క్లియరెన్స్ సర్టిఫికెట్ జారీ చేసేందుకు నిరాకరించిందంటే ఆ సినిమా ఎంత ఘాటుగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఆ దెబ్బకి నిర్మాతలు ముంబయి వెళ్లి అక్కడ సీబీఎఫ్సీ నుంచి ‘ఎ’ సర్టిఫికెట్ పొందారు. ఈ సినిమాను తెలుగులోనూ అనువదించి ప్టెంబరు నెలలో విడుదల చేయనున్నారు. మరి ప్రస్తుతం తమిళంలో ఉన్న ట్రైలర్ మీరూ ఒక లుక్ వేసెయ్యండి మరి !
“కొన్ని క్వశ్చన్స్ అడగనే కూడదు, అప్పుడు ఆన్సర్స్ దొరకలేదనే గిల్ట్ ఉండదు.” అవును, ఈ ట్రైలర్ కథ ఏంటి అనే ప్రశ్న అడగకూడదు, ఎందుకంటే జవాబు దొరకలేదనే బాధ ఉంటుంది. ఒక థ్రిల్లర్ సినిమా ట్రైలర్ ఎంత అర్ధం కాకపోతే అంత బావున్నట్టే అని నమ్మక తప్పాలి. ఎందుకంటే, మామూలుగానే మనకి థ్రిల్లర్ సినిమా చూస్తున్నప్పుడు, చివరికి వచ్చేసరికి చాలా ప్రశ్నలు పేరుకుపోతాయ్. అలాంటిది ట్రైలర్ లో చెప్పడానికి ఏముంటుంది. సరిగ్గా ఇక్కడ కూడా అదే జరిగింది. లూసియా అనే కన్నడ సైకలాజికల్ థ్రిల్లర్ తీసిన పవన్ కుమార్ ఈ సినిమాను తీసారు. ఆ సినిమా లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి కూడా సెలెక్ట్ అయ్యింది. ఆ సినిమాకు ఈ యు-టర్న్ ఏమాత్రం తగ్గకూడదు అనుకున్నారేమో, అదే స్థాయిలో థ్రిల్ ఉండేలా చూసుకున్నారు.
వీలయినంత వరకు జస్ట్ ఒక లైన్ అర్ధమవుతుంది ఇలాంటి ట్రైలర్స్ లో. అదేంటంటే ఆ కథ ఏ సబ్జెక్టు చుట్టూ తిరుగుతుంది అని, అండ్ ఎవరి చుట్టూ తిరుగుతుంది అని. ఈ ట్రైలర్ కూడా అదే చెప్పింది, మొదట నుండి చివర వరకు సమంతా ఎక్కడ మిస్ కాలేదు, అంటే మెయిన్ లీడ్ తనే కాబట్టి తన చుట్టూనే సినిమా రన్ అయినట్లు అనిపిస్తుంది. అయితే, కోపంగా కనిపిస్తున్న భూమిక స్టిల్స్ కూడా కథకు అసలు మూలం తానేనేమో అన్న సందేహం కలిగిస్తున్నాయి. ఇక రాహుల్ రవీంద్రన్ కీలకమయిన పాత్రనే పోషిస్తున్నట్టు కనిపిస్తుంది. అలాగే, ఆది పినిశెట్టి కూడా ఎప్పటి లానే ఒక బరువయిన పాత్రనే నడిపిస్తున్నాడు అని అర్ధమవుతుంది. ఇన్ని తెలిసి, ట్రైలర్ లో ఏమి తెలియడం లేదు, ఇలాంటి ట్రైలర్ లు ఏం చెప్పావు అంటారేంటి అనుకోవద్దు. సరిగ్గా గమనిస్తే, కేవలం పాత్రల ప్రాముఖ్యత ఏంటో మాట్లాడుకున్నాం గాని, కథ గురించి కాదు. కాని, ట్రైలర్ లో జరిగిన సంభాషణల బట్టి అర్ధమయ్యింది ఏంటబ్బా అంటే అది మొత్తం ఒక హత్య చుట్టూ తిరుగున్న కథ. ఇవన్నీ, మనం అనుకోవడానికి, ఊహించుకోవడానికి బాగానే ఉంటాయ్ గాని తెర మీద చూస్తే గాని అర్ధం కాదు, అది హత్య చుట్టూ తిరుగుతున్న కథో లేక మన తల తిరిగే ట్విస్ట్ ఇచ్చేలా ఇంకేమయిన ఉందో. ఎందుకంటె, అవి థ్రిల్లర్ మూవీస్.
కానీ, కథను ఏమాత్రం చెప్పకుండా, ట్రైలర్ ని పదే పదే చూడగలిగేలా చెయ్యడం అనేది ప్రతిభ అనే చెప్పాలి. ఈ దర్శకుడు పవన్ కుమార్ అదే ప్రతిభ చూపించాడు, అన్ని సార్లు చూడడానికి ఏముంటాయి అంటే విజువల్స్. ఆ టేకింగ్, ఆ కెమెరా యాంగిల్స్, కొత్తగా అనిపించేలా ఏమయినా షాట్స్, ఇవన్ని ఈ ట్రైలర్ ఉన్నాయని మాత్రం చెప్పగలం. 100% థ్రిల్లింగ్ ఇచ్చేలా సినిమా ఉంటుందనే నమ్మకం అయితే కలిగింది. ఇక సమంతా పెళ్లి తరువాత యు-టర్న్ తీసుకొని లేడీ ఓరియెంటెడ్ కథల వైపు అడుగేస్తుంది. అలాగే, దర్శకుడిగా యు-టర్న్ తీసుకున్న రాహుల్ రవీంద్రన్ మళ్ళీ యాక్టర్ గా కనిపిస్తున్నాడు. అదే విధంగా, పెళ్లి తరువాత ఇన్నేళ్ళకి ఎం.సి.ఎ సినిమాతో యు-టర్న్ తీసుకున్న భూమిక, కొత్త కొత్త కథలతో ఎప్పటికప్పుడు యు-టర్న్ లు తీసుకునే ఆది పినిశెట్టి ఇందులో కనిపిస్తున్నారు. వీరందరు కలిసి మనకి ఒక మంచి కిర్రాక్ థ్రిల్లర్ మూవీనే తీసుకువాస్తారని ఆశిద్దాం.
దగ్గుబాటి రానా సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స నిర్మిస్తున్న సినిమా కేరాఫ్ ‘కంచరపాలెం’. వెంకటేష్ మహా అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి విజయ ప్రవీణ పరుచూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్వీకర్ అగస్థి సంగీతం అందిస్తున్నారు. న్యూయార్క్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైన తొలి తెలుగు సినిమా కావడం సినిమా మీద మరింత అంచనాలు పెంచేస్తోంది వైజాగ్ దగ్గరలో ఉన్న కంచెరపాలెం నేపథ్యంలో సాగే భిన్నమైన ప్రేమకథగా ఈ సినిమా సెప్టెంబరు 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా ఈ చిత్రం ట్రైలర్ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. ‘కంచరపాలెం’ సినిమాను సమర్పిస్తుండటం చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా ఓ గేమ్ ఛేంజర్ అవుతుందని నమ్ముతున్నా. ఈ ఏడాది రాబోతున్న అతి పెద్ద చిన్న సినిమా ఇది’అంటూ రానా ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. మీరూ ట్రైలర్ మీద ఒక లుక్ వెసెయ్యండి మరి
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ‘అరవింద సమేత’ టీజర్ వచ్చేసింది. నేడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ టీజర్ను త్రివిక్రమ్ నందమూరి అభిమానులకు కానుకగా ఇచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్ కోసం కొన్ని సంవత్సరాలుగా ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. వారందరి ఎదురు చూపులకు తగ్గట్లుగానే ఈ చిత్రం ఉండబోతుందని దర్శకుడు త్రివిక్రమ్ టీజర్తోనే తేల్చి చెప్పాడు. మాస్ ఆడియన్స్కు దేవుడు అయిన ఎన్టీఆర్ను ఎలా వారు చూడాలనుకుంటున్నారో ఈ చిత్రంలో దర్శకుడు అలా చూపించబోతున్నాడు. తన గత చిత్రం అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రంపై ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని, అన్ని విషయాల్లో పక్కా ప్రణాళికతో ఈ చిత్రాన్ని చేస్తున్నట్లుగా త్రివిక్రమ్ టీజర్తో చెప్పేశాడు.
ఎన్టీఆర్ను చాలా పవర్ ఫుల్గా, మాస్గా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అవ్వగలడని టీజర్ చూస్తుంటే అనిపిస్తుంది. తప్పకుండా ఇదో బ్లాక్ బస్టర్ చిత్రంగా, దసరా విజేతగా నిలుస్తుందని సినీ వర్గాల వారు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘అరవింద సమేత’ టీజర్లో ఉన్న డైలాగ్స్ అప్పుడే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మచ్చలపులి మొహంపై గాండ్రిస్తే ఎలా ఉంటుందో తెలుసా అని జగపతిబాబు చెప్పే డైలాగ్తో పాటు ఎన్టీఆర్ చెప్పిన కంటపడ్డవా కనికరిస్తానేమో… ఎంట పడ్డానా నరికేస్తా.. డైలాగ్కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఎన్టీఆర్ లుక్ మరియు స్టైల్ కూడా చాలా బాగుంది. జైలవకుశ చిత్రానికి ఈ చిత్రంకు చాలా వైవిధ్యంను ఎన్టీఆర్ చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. దసరా కానుకగా అక్టోబర్ రెండవ వారంలో సినిమా విడుదల కాబోతుంది. ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ చిత్రంగా ఇది నిలవడం ఖాయంగా కనిపిస్తుంది.
“మునుపెన్నడూ గెలవలేదనే భావనతో ప్రాక్టీస్ చెయ్యాలి, ఎన్నడూ ఓడిపోలేదానే భావనతో ప్రదర్శన ఇవ్వాలి” అని చెప్పే ప్రభుదేవా గారి మాటలు డాన్స్ గురించి. ఇండియాలో డాన్స్ అంటే ఎవరికయినా మొదటగా గుర్తోచ్చే పేరు ‘ప్రభుదేవా’. ఆయన ఇంతక ముందు ఎబిసిడి, ఎబిసిడి2 అనే డాన్స్ ని థీమ్ గా తీసుకొని సినిమాలను చేశారు. ఇప్పుడు మళ్ళీ డాన్స్ ని థీమ్ గా తీసుకొని ‘లక్ష్మీ’ అనే సినిమాను తీసుకొస్తున్నారు.
ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు యూ ట్యూబ్ లో హాల్ చల్ చేస్తుంది. ప్రతీ సినిమాకి కొత్త డాన్సర్స్ ని పరిచయం చేస్తూ వచ్చారు ప్రభుదేవా. ఇప్పుడు, ఈ సినిమాకి కోసం ఆయనకి దొరికిన ఆయుధం దిత్య భండే. ఈ చిన్నారి ఇంతకు ముందు డాన్స్ షోస్ ద్వారా చాలా ఫేమస్. ప్రభుదేవా గారు సెలెక్ట్ చేసుకున్నారంటే ఆ చిన్నది ఏ రేంజ్ లో డాన్స్ చేస్తుందో మనం ఊహించుకోవచ్చు. ఇంకా ప్రభుదేవా గారి చేతుల్లో పడ్డాక ఇంకొంచెం సాన పెడతారని మనకి తెలిసిన విషయమే. ట్రైలర్ లో ఆ డాన్స్ చూస్తే ఎవరికైనా అర్ధమయిపోతుంది ఆ స్పీడ్. ఇక సినిమా ఎలా ఉంటుందో ఆగష్టు 24న థియేటర్ లలోనే చూడాలి.
పల్లకిలో పెళ్లికూతురు, బసంతి చిత్రాల తర్వాత రాజా గౌతమ్ నటిస్తోన్న చిత్రం మను గౌతం సరసన హీరోయిన్ గా చాందిని చౌదరి నటిస్తోంది. ఈ చిత్ర ట్రైలర్ను చిత్రయూనిట్ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో విడుదల చేసింది. నిర్వాణ సినిమాస్ సమర్పణలో క్రౌడ్ ఫండెడ్గా నిర్మితమైన ఈ చిత్రానికి ఫణీంద్ర నరిశెట్టి దర్శకుడు.
తీగకొండికి వానపామును వేస్తారు వానపామును చూస్తూ వెనకున్న తీగను వదిలేస్తుంది చేప అంటూ డిఫరెంట్ గా సాగుతున్న ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఒకసారి మీరూ ఒక లుక్కేయండి మరి..
ఈరోజు ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. అలాగే “మహర్షి” టైటిల్ తో ఇచ్చిన ట్విస్ట్ కూడా ప్రిన్స్ ఫ్యాన్స్ ను మెప్పించింది. ఇక “మహర్షి”లోని రొమాంటిక్ యాంగిల్ ను చూపిస్తూ విడుదల చేసిన టీజర్ ఫ్యాన్స్ కి మహేష్ గిఫ్ట్ లా అనిపిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో చూపించిన ప్రిన్స్ ను వీడియో రూపంలో ప్రజెంట్ చేస్తూ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చాడు దర్శకుడు వంశీ పైడిపల్లి.
ఇంతకు మునుపులా కాకుండా డిఫరెంట్ మ్యానరిజంతో ల్యాప్ టాప్ పట్టుకుని నడిచి వస్తున్న ప్రిన్స్, తల నిమురుకోవడం… అమ్మాయిల వంక ఓరకంటితో చూడడం, మన వాడిని చుసిన అమ్మయిలు ఫ్లాట్ అయ్యి మళ్ళీ వెనక్కు వెనక్కు తిరుగి చూస్తూ పోవడం టీజర్ లో హైలైట్స్. 2019 ఏప్రిల్ 5వ తేదీన “మహర్షి”ని విడుదల చేయబోతున్నట్లుగా వచ్చిన ఈ టీజర్ మహేష్ కి మరో బ్లాక్ బస్టర్ వచ్చినట్టే అని క్లారిటీ ఇస్తోంది. ముగ్గురు బడా నిర్మాతలు పీవీపీ, అస్వినీదత్, దిల్ రాజులు కలిపి ప్రోడ్యుస్ చేస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తుండగా పూజా, అదితీలు ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ లు చేస్తున్నారు.
ఛలో సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్న నాగశౌర్య కొత్త సినిమా @నర్తనశాల టీజర్ కాసేపటి క్రితమే విడుదలైంది. డైరెక్టర్ వంశీ పైడిపెల్లి ఈ సినిమా టీజర్ విడుదల చేసారు. ‘ఛలో’ లాంటి బ్లాక్బస్టర్ చిత్రం తరువాత నాగశౌర్య, ఐరా క్రియోషన్స్ కాంబినేషన్ లో ప్రొడక్షన్ నెం-2 గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్ర ఫస్ట్లుక్ని ఇటీవలే విడుదల చేశారు. ఈలుక్కి సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ రావటం సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచేస్తోంది. ఈ చిత్రంలో సౌర్య సరసన కష్మిర పరదేశి, యామిని భాస్కర్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఇటీవలే ఇటలీలో సాంగ్స్ షూటింగ్ పూర్తిచేసుకున్న సినిమా పోస్ట్ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని అగష్టు 31న విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహలు చేస్తున్నారు.
దిల్ రాజు బ్యానర్ నుండి వచ్చే సినిమాలకు సహజంగానే హైప్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అదేరకమైన పాజిటివ్ బజ్ దిల్ రాజు బ్యానర్ నుండి రానున్న తాజా చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం‘ పై కూడా ఉంది. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ రాశి ఖన్నా జంటగా నటిస్తున్నారు. ఈమధ్యనే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ సాంగ్ ప్రోమోలు చూసిన వారు టీజర్ ను కూడా అలానే ఫ్యామిలీ ఆడియన్స్ కు తగ్గట్టే ఉంటుందేమో అనుకున్నారు. కానీ వాళ్ళందరినీ యూత్ ఫుల్ టీజర్ తో సర్ప్రైజ్ చేసింది ‘శ్రీనివాస కళ్యాణం’ టీమ్. ఇప్పుడు నరిన్ని అంచనాల్ని పెంచేస్తూ రిలీజ్ అయిన ట్రైలర్ మీద ఒక లుక్ వేసెయ్యండి మరి.
విజయ్ ఆంటోని సినిమా అనగానే ప్రేక్షకులు ఒక అంచనాకి వచ్చేస్తారు. ఎందుకంటే ఆయన సినిమాల్లోని కథాకథనాలు పాత్రలను మలిచే విధానం కొత్తగా ఉంటాయి కాబట్టి. ఆయన సినిమాలు హిట్టా ఫట్టా అన్న సంగతి పక్కన పెడితే, అన్నీ వైవిధ్యభరితమైనవిగా అనిపిస్తాయి. తాజాగా ఆయన హీరోగా తమిళంలో ‘తిమిరు పిడిచ్చవన్’ చిత్రం రూపొందుతోంది. తెలుగులో ఈ సినిమాకి ‘రోషగాడు’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా నుంచి తాజాగా మోషన్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్టు ఈ టీజర్ ను బట్టి తెలుస్తోంది. ‘ఒళ్లంతా పొగరురా .. పొగరుకే మొగుడురా .. మాట పడని ‘రోషగాడు’రా .. అంటూ ఈ టీజర్ ను వదిలారు. యాక్షన్ ప్రధానంగా వదిలిన ఈ టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మీరూ టీజర్ ని చుసేయ్యండి మరి.
నాగచైతన్య, అను ఇమ్మానుయేల్ హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. నాగచైతన్య అత్తగా ప్రముఖ నటి రమ్యకృష్ణ నటించారు. ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 31న విడుదల చేస్తున్నట్లు నిర్మాత ప్రకటించారు. ఈ మేరకు నిన్న విడుదల తేదీ పోస్టర్కు కూడా విడుదల చేశారు. కొద్ది సేపటి క్రితమే చిత్ర యూనిట్ సినిమా తీజర్ ని విడుదల చేసింది. తన సినిమాల్లో హీరో కి ఎదో ఒక జబ్బు లాంటిది పెట్టె మారుతి ఈ సినిమాలో మాత్రం ఆ జబ్బు హీరోయిన్ కి పెట్టాడు, యా జబ్బు పేరే ఈగో…అది ఎంత అంటే తను లవ్ చేస్తున్న అబ్బాయి దగ్గరకి వెళ్లి నువ్ నాకు ప్రొపోజ్ చేయి నేను ఓకే చేస్తానని చెప్పేంత. మొత్తానికి టీజర్ సినిమా మీద ఉన్న అంచనాలను పెంచుతుందనే చెప్పాలి.
అక్కినేని హీరో సుశాంత్, హీరోయిన్ రుహాని తాజా చిత్రం చి.ల.సౌ. ఇప్పటికే విడుదలైన ప్రమోస్ తో ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను అక్కినేని నాగార్జున ఈరోజు విడుదల చేశాడు. ఈ ట్రైలర్ లో సినిమా కాన్సెప్ట్ ను డైరెక్టర్ రాహల్ రవీంద్రన్ క్లారిటీ గా చెప్పాడు.
హీరో సుశాంత్ ను వాళ్ళ అమ్మ, ఫ్రెండ్స్ అందరు పెళ్లి పెళ్లి అని వేధిస్తుంటారు. ఇక ఇలాంటి వాళ్ళ మధ్యలో తిప్పలు పడే పెళ్ళీడుకొచ్చిన యువకుడిగా సుశాంత్ రోల్ సహజంగా ఉంది. హీరోయిన్ రుహాని ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి. అందరి అమ్మాయిల లాగే ఈ అమ్మాయి కూడా హీరో ని పెళ్లి చూపులు లోనే ప్రేమించి, హీరో అంటే ఇష్టం లేదన్నట్టుగా ప్రవర్తిస్తుంది.
‘మేమేమైనా వాషింగ్ మిషన్లమా ఫీచర్స్ చూసి కొనడానికి?’ హీరోయిన్ చెప్పే డైలాగ్… ‘హైదరాబాద్ లో రెండు రకాల అమ్మాయిలుంటారు. ఐదర్ సింగల్ ఆర్ ఇంట్రెస్టింగ్… నెవర్ బోత్’… హీరో సుశాంత్ చెప్పే డైలాగ్. ఈ రెండు డైలాగ్స్ యూత్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ చిత్రం అన్నపూర్ణ బ్యానర్ లో రావటం వలన ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మొత్తానికి సుశాంత్ ఈ చిత్రం ద్వారా హిట్ కొట్టేయవచ్చు. ‘చి ల సౌ’ ఆగష్టు 3 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
నిజం చెప్పు అర్జున్ నువ్వు ఎవరు..? మరొక విలక్షణమయిన సినిమా విలక్షణమైన నటులతో ‘గూఢచారి’… క్షణం తరువాత అడవి శేషు నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ప్రకాష్ రాజు, సుభిత దులిపల ఇతర ముఖ్య తారాగణంగా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచేస్తుంది. థ్రిల్లర్ ఫార్మట్లా కనిపిస్తున్న ఈ ట్రైలర్ సినిమా కథను చెప్పి చెప్పనట్టుగా చెప్పింది.
ఇక ట్రైలర్ గురించి మాట్లాడాలంటే, ఏదో రక్షణ భద్రతా కథాంశంలా అనిపిస్తుంది. తండ్రిని ఆదర్శంగా తీసుకొనే కొడుకు కథ అని అనుకునేలోపల, హీరోని గూఢచారిగా అనిపించేలా ట్రైలర్ ని కట్ చేశారు. ఒక యాక్షన్ థ్రిల్లర్ అనే విషయాన్ని మాత్రం గట్టిగా చెప్పొచు. అయితే, క్షణం సినిమా రైటర్ కాబట్టి ఇది కూడా క్షణం లానే మంచి కథ అయి ఉండవచ్చు. ఏది ఏమైనా కొత్త తరహా కథలు కావలనుకున్న మనవారికి ఈ థ్రిల్లర్ నచ్చచ్చేమో. కాగా, ఈ సినిమా ఆగష్టు 3వ తారీకు రిలీజ్ చేస్తున్నారు.
కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాల నుండి కథానాయికే ముఖ్య పాత్రగా సినిమాలు రావడం మొదలు పెట్టాయి. అయితే, కొత్త హీరోయిన్స్ అందరూ హీరోల పక్కన జంటగా చేస్తూ బిజీగా ఉంటే పాత హీరొయిన్స్ అటు ఆ సినిమాలతో పాటు ఇటు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేస్తున్నారు. అయితే, అనుష్క, నయనతార, త్రిష ఆ జాబితాలో ముందు వరసలో ఉన్నారనే చెప్పాలి. ఇప్పుడు నయనతార తానే లీడ్ రోల్ చేస్తూ మరో సినిమాతో సిద్ధంగా ఉంది. అదే, కోకోకోకిల… ట్రైలర్ చూస్తే ఇది స్మగ్లింగ్ నేపధ్యంలో సాగే కథలా ఉంది. లైకా ప్రొడక్షన్స్ లాంటి బ్యానర్ లో ఈ సినిమా రావడం కొంచెం అంచనాలను రేకెత్తిస్తుంది. ఇలాంటి భిన్నమైన కథతో వస్తున్న నయనతార హిట్ కొడుతుందో లేదో చూడాలి ఇక… ఈ సినిమా ఆగష్టు 17వ రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది.
‘అర్జున్ రెడ్డి’ చిత్రం తర్వాత యూత్ ఐకాన్గా మారిపోయిన విజయ్ దేవరకొండ త్వరలో ‘గీత గోవిందం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. వచ్చే నెల 15న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ ఎత్తున ఈ చిత్రం ప్రమోషన్స్ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్కు అనూహ్యమైన స్పందన దక్కింది. టీజర్ భారీ ఎత్తున వ్యూస్ను రాబట్టిన నేపథ్యంలో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రంలోని ఒక పాటను విజయ్దేవరకొండ పాడటంతో అంచనాలు భారీగా పెరిగాయి.
ఇప్పటి వరకు నటుడిగా ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో సింగర్గా కూడా మెప్పించాడు. వాట్ ద ఎఫ్ అంటూ ఆడవారి గురించి పాడిన పాట ప్రస్తుతం యూత్లో విపరీతంగా ఆధరణ దక్కించుకుంటుంది. భారీ ఎత్తున ఈ పాటకు వ్యూస్ దక్కుతున్నాయి. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఈ పాట మేకింగ్ వీడియోను యూట్యూబ్లో విడుదల చేశారు. ఈ పాటకు యూట్యూబ్లో భారీ ఎత్తున వ్యూస్ దక్కించుకుంటుంది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తుంది.
హీరోకి ఎదో ఒక రోగం పెట్టి నవ్వులు పూయించడంలో దిట్ట దర్శకుడు మారుతి. ఆయన ఇప్పుడు రోగాన్ని తెరపై ఆవిష్కరిస్తున్నాడు. ‘భలే భలే మాగడివోయ్’ చిత్రంలో హీరోకి నానికి మతిమరుపు .. ‘మహానుభావుడు’ చిత్రంలో శర్వానంద్కు వోసీడీ (అతిశుభ్రం) ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్కి నాన్ స్టాప్ ఫన్ జోడించి హిట్లు కొట్టాడు మారుతి. మొత్తానికి మారుతి సినిమాలో హీరోకి ఓ లోపం ఉండటం, ఆ లోపాన్ని సరిదిద్దుకునేందుకు నానా కష్టాలు పడటం ఆయన సినిమాల్లో సరికొత్త స్టైల్గా మారింది. తాజాగా ఆయన కధనందించిన ‘బ్రాండ్ బాబు’ అనే చిత్రం ట్రైలర్ ఇప్పుడు విడుదల అయ్యింది. ఈ మూవీ ట్రైలర్ను నేడు నాగ చైతన్య చేతుల మీదుగా విడుదల చేశారు. సుమంత్ శైలేంద్ర (డెబ్యూ), ఈషా రెబ్బా జంటగా నటించిన ఈ చిత్రానికి ఈటీవీ ప్రభాకర్ దర్శకత్వం వహించారు. తాజాగా విడుదలైన ట్రైలర్లో హీరోకి బ్రాండ్ అనే రోగం ఉంటుంది. బ్రాండ్ ఉన్న వస్తువుల్ని మాత్రమే ఇష్టపడే పాత్రలో సుమంత్ శైలేంద్ర కామెడీ పండిస్తున్నాడు. ట్రైలర్లోనే సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేసిన దర్శకుడు ‘బ్రాండ్ బాబు’ ప్రేక్షకులని ఏమాత్రం నవ్వించనున్నాడో మరి ?