సెప్టెంబ‌రు 9 స‌చిన్ కు ఎంతో ప్ర‌త్యేకం

0

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

sachin tendulkar first century in odi on september 9

స‌చిన్ టెండూల్క‌ర్ అభిమానులు సెప్టెంబ‌రు 9 ని ఎప్ప‌టికీ మ‌రిచిపోలేరు. ఈ రోజే స‌చిన్ అంత‌ర్జాతీయ వ‌న్డే క్రికెట్లో తొలి సెంచ‌రీ చేయ‌టం ద్వారా త‌న ప‌రుగుల రికార్డు మొద‌లుపెట్టారు. 1994 సెప్టెంబ‌రు 9న తొలి సెంచ‌రీ చేసిన స‌చిన్ 2013లో రిటైర‌య్యే లోపు రికార్డు స్థాయిలో 49 సెంచ‌రీలు చేశారు. అయితే ఇప్ప‌టి క్రికెట‌ర్ల‌లా క్రికెట్లోకి అడుగు పెట్టిన తొలిరోజుల్లోనే స‌చిన్ సెంచ‌రీ చేయ‌లేదు. ఆయ‌న తొలి సెంచ‌రీ చేయ‌టానికి ఐదేళ్లు ప‌ట్టిందంటే ఆశ్చ‌ర్యం క‌లుగ‌క మాన‌దు.

త‌న కెరీర్లో తొలి వ‌న్డే మ్యాచ్‌ను స‌చిన్ 1989లో ఆడాడు. ఐదేళ్ల త‌రువాత 1994లో త‌న 78వ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై 130 బంతుల్లో 110 ప‌రుగులుచేయ‌టం ద్వారా స‌చిన్ తొలి సెంచ‌రీ న‌మోదుచేశాడు. రెండు సిక్సులు, నాలుగు ఫోర్లు చేయ‌టం ద్వారా స‌చిన్ సెంచ‌రీ సాధించాడు. ఇక ఆ త‌ర్వాత ఆయ‌న సెంచ‌రీల ప్రయాణం ఎక్క‌డా ఆగ‌లేదు. 24 ఏళ్ల కెరీర్ లో రికార్డు స్థాయిలో సెంచ‌రీలు చేసిన స‌చిన్ భార‌త క్రికెట్ లోనే కాదు…అంత‌ర్జాతీయ క్రికెట్ లోనూ ఎవరూ ఊహించ‌ని ఎత్తుల‌కు ఎదిగాడు.

ప్ర‌స్తుతం ఈ రికార్డును బ్రేక్ చేసే క్రికెట‌ర్ క‌నిపించ‌టం లేదు. స‌చిన్ స్థాయికి చేర‌టం ఇప్పుడున్న క్రికెట‌ర్ల‌కు అసాధ్యం. దానికి తోడు ఇప్ప‌టి వేగానికి త‌గ్గ‌ట్టుగా క్రికెట‌ర్లు వ‌న్డేల క‌న్నా టీ20లు ఎక్కువ‌గా ఆడుతున్నారు. అందుకే స‌చిన్ సాధించిన 49 సెంచ‌రీల రికార్డు కొన్నేళ్ల వ‌ర‌కు అంత‌ర్జాతీయ క్రికెట్లో చెరిగిపోదు. అటు ఈ రోజు ప్ర‌త్యేక‌త‌ను ఐసీసీ సైతం త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో గుర్తుచేసింది. స‌చిన్ త‌న 78వ మ్యాచ్ లో తొలిసెంచ‌రీ చేశాడ‌ని ట్వీట్ చేసింది. స‌చిన్ కూడా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఈ తీపి జ్ఞాప‌కాన్ని గుర్తుచేసుకున్నాడు. స‌మ‌యం వెళ్లిపోతున్నా…మెమ‌రీలు మాత్రం ఎప్ప‌టికీ గుర్తుండి పోతాయ‌ని స‌చిన్ ట్వీట్ చేశాడు. ఈ తీపిగుర్తును పోస్ట్ చేసినందుకు ఐసీసీకి థ్యాంక్స్ చెప్పాడు.


మరిన్ని వార్తలు:

40 ఏళ్లు వ‌చ్చిన త‌రువాతే రిటైర్మెంట్

నా ఇద్ద‌రు కూతుళ్ల‌లాగే నువ్వూ…

అర్జున ర‌ణ‌తుంగ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

నారా నానమ్మ స్పీచ్ కి మనవడి చప్పట్లు.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

chandrababu wife bhuvaneswari speech at Heritage Groups Completes 25 Years

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల్లో బయటికి అతి తక్కువగా కనిపించేది ఆయన సతీమణి భువనేశ్వరి. రాజకీయాలు కోసం లోకేష్, హెరిటేజ్, ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యక్రమాల కోసం బ్రాహ్మణి కూడా పబ్లిక్ లో బాగానే కనిపిస్తుంటారు. బాబు సతీమణి భువనేశ్వరి కనిపించడమే అరుదు అయితే ఆమె మాట వినిపించడం ఇంకా అరుదు. అంత మాత్రాన ఆమె బాగా మాట్లాడలేరు అనుకుంటే పొరపడ్డట్టే. హెరిటేజ్ సంస్థ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆమె ప్రసంగం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చెల్ చేస్తోంది. చంద్రబాబు, లోకేష్ ,బ్రాహ్మణి సమక్షంలోనే ఆమె స్పీచ్ చూసి మనవడు దేవాన్ష్ కూడా చప్పట్లు కొట్టాడు. ఆ స్పీచ్ వీడియో మీ కోసం.

మరిన్ని వార్తలు:

ఆయన కోసం 14 ప్రముఖ ఆలయ అర్చకులు.

బిగ్‌బాస్‌పై కామెంట్స్‌ చేసిన హైపర్‌ ఆది

హీరోలందరిలో రానా ప్రత్యేకం..!

కుశ టీజర్‌ వచ్చేసింది …ఎన్టీఆర్ అదుర్స్

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కుశ టీజర్‌ వచ్చేసింది ...ఎన్టీఆర్ అదుర్స్ - Telugu Bullet

ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం పోషిస్తున్న జై ల‌వ‌కుశ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. జై, ల‌వ‌, కుశ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు ఎన్టీఆర్‌. ఇప్ప‌టికే జై, ల‌వ టీజ‌ర్లు విడుద‌ల కాగా కుశ టీజ‌ర్‌ను తాజాగా చిత్ర‌బృందం  విడుద‌ల‌చేసింది. కొట్టేయ‌డంతో పాటు కొట్ట‌డ‌మూ వ‌చ్చురా అంటూ  ఎన్టీఆర్ టీజ‌ర్ లో చెప్తున్న డైలాగ్ ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ డ‌బ్బు తీసుకెళ్లి అమెరికాలో ఇన్వెస్ట్ చేసి ఆ ఆధార్ కార్డేదో నాకు ఇప్పించేయండి బాబూ అని తార‌క్ అమాయ‌కంగా అంటోంటే…దాన్ని ఆధార్ కార్డు అన‌ర‌మ్మా..గ్రీన్ కార్డు అంటారు అని వ‌స్తున్న డైలాగ్ న‌వ్వులు పూయిస్తోంది.

ఎన్టీఆర్ మూడు పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌టంతో జై ల‌వ‌కుశ‌పై ఇటు టాలీవుడ్ లోనూ, అటు ప్రేక్ష‌కుల్లోనూ భారీ అంచ‌నాలున్నాయి. ద‌స‌రా కానుక‌గా ఈ నెల 21న సినిమా విడుద‌ల కానుంది. ఎన్టీఆర్ స‌ర‌స‌న రాశీఖ‌న్నా, నివేదా థామ‌స్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. జైల‌వ‌కుశ‌ను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల సింపుల్ గా ఆడియో విడుద‌ల చేసిన చిత్ర యూనిట్…ప్రి రిలీజ్ ఫంక్ష‌న్ ను మాత్రం గ్రాండ్ గా జ‌రిపేందుకు స‌న్నాహాలు చేస్తోంది.

మరిన్ని వార్తలు

నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నా..

0

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

sp balasubrahmanyam clarifies is health condition in social media

గానగంధర్వుడు ఎస్వీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం కొన్నాళ్లుగా బాగుండటం లేదని, ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ సోషల్‌ మీడియాలో గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. అనారోగ్య కారణాల వల్ల ఆయన ఇవ్వాల్సిన స్టేజ్‌ షోలను, ఇంకా పలు కార్యక్రమాలను రద్దు చేసుకున్నారంటూ ప్రచారం మొదలైంది. ఎస్వీబి ఆరోగ్యంపై వస్తున్న వార్తలతో ఆయన అభిమానులు కలవరంకు గురవుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రతి రోజు వందల ఫోన్‌లు వస్తున్నాయి. ఆ కారణంగా ఎస్వీబీ నేరుగా మీడియా ముందుకు వచ్చి తన ఆనారోగ్యంపై వస్తున్న పుకార్లకు ఫుల్‌ స్టాప్‌ పెట్టే ప్రయత్నం చేశాడు.

తన అఫిషియల్‌ ఫేస్‌బుక్‌ పేజ్‌లో వీడియో మెసేజ్‌ను ఇచ్చి తాను ఆరోగ్యంగా ఉన్నట్లుగా అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు. తాను షోలను రద్దు చేసుకోవడానికి కారణం తన సోదరి మరణించడం అని, ఆమె మరణం కారణంగా 12 రోజుల పాటు అక్కడే ఉండాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నాడు. జలువు, దగ్గు వచ్చి హాస్పిటల్‌కు వెళ్లినా కూడా తీవ్ర అనారోగ్యం అంటూ ప్రచారం చేస్తారా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ తాను యదావిధిగా షోలు నిర్వహిస్తున్నాను, మొన్న 2వ తారీకున బెంగళూరులో ప్రదర్శణ ఇచ్చాను. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో స్వరాభిషేకం షూటింగ్‌లో పాల్గొంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఎస్వీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యంగా ఉన్నాను అంటూ స్వయంగా ప్రకటించడంతో ఆయన అభిమానులు రిలాక్స్‌ అయ్యారు. అయితే ఇలాంటి చెత్త పుకార్లను, చెత్త ప్రచారాలను చేస్తూ మనోభావాలను దెబ్బ తీయడం మంచి పద్దతి కాదని సోషల్‌ మీడియాలోని వారికి సినీ ప్రముఖులు సలహా ఇస్తున్నారు.

మరిన్ని వార్తలు:

అర్జున్‌ రెడ్డిని తిరష్కరించిన అందాల రాక్షసి?

‘ఫిదా’ చేసిన వరుణ్‌ ‘తొలిప్రేమ’

దేవసేన కూడా అర్జున్‌ రెడ్డి అభిమాని

డేరా బాబా సీక్రెట్స్ మీరూ చూస్తారా ?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

police breaks gurmeet ram rahim home

డేరా బాబా జైల్లో కెళ్ళి కూర్చున్నాక ఆయన గారి లీలలు ఒక్కోటిగా బయటికి వస్తున్నాయి. ఆయన ఆడంబరాలు ఏ స్థాయిలో వుంటాయో తెలుసుకోవాలంటే గురుమీత్ ఇంట్లో డైనింగ్ హాల్ , బెడ్ రూమ్ ఓ సారి చూడండి. సోషల్ మీడియాలో హల్ చెల్ చేస్తున్న ఆ వీడియో మీ కోసం.

మరిన్ని వార్తలు:

విజయవాడ కి కెసిఆర్… ఎందుకంటే?

డైలాగ్ కింగ్ కి జగన్ ఫుల్ క్లాస్.

లోకేష్ కి సైకాలజిస్ట్ అవసరం… జగన్ ఎప్పుడు నేర్చుకుంటాడో ?

ఏవేవో క‌ల‌లు క‌న్నా…ఏ వైపో క‌దులుతున్నా…

0

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

akhil HELLO movie live song performance at SIIMA awards
ఈ మ‌ధ్య హీరోలు ఒక్క న‌ట‌న‌కే ప‌రిమితం కాకుండా.. సినిమాలో త‌మ‌కు ఆస‌క్తి ఉన్న రంగాల్లోనూ ఇన్ వాల్వ్ అవుతున్నారు. ఎక్కువ మంది హీరోలు సినిమాలో సొంత గొంతుతో ఓ పాట పాడేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మ‌రికొంద‌రు అవార్డుల ఫంక్ష‌న్స్ లో గొంతు స‌రిచేసుకుంటున్నారు.  వారి బాట‌లో యువ హీరో అఖిల్ కూడా ఒక అవార్డు ఫంక్ష‌న్ లో పాడిన పాట యూ ట్యూబ్ లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.
2017 సైమా అవార్డుల వేడుక‌లో అఖిల్ ఈ పాట పాడారు. త‌న రెండోచిత్రం హాలోలోని పాట‌ను అఖిల్ పాడిన తీరు చూసి అవార్డ్స్ ఫంక్ష‌న్ కు హాజ‌ర‌యిన సినీ ప్ర‌ముఖులు ఆశ్చ‌ర్య‌పోయారు. క్రికెట్‌, న‌ట‌న‌తో పాటు అఖిల్ కు గాయ‌కుడిగానూ ప్ర‌తిభ ఉంద‌ని పలువురు ట్విట్ట‌ర్ లో ప్ర‌శంసించారు కూడా. అయితే అవార్డుల కార్య‌క్ర‌మం ఇంకా ఏ చాన‌ల్ లోనూ ప్ర‌సారం కాక‌పోవ‌టంతో అఖిల్ ఎలా పాడారో కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌యిన వారికి త‌ప్ప మ‌రెవ‌రికీ తెలియ‌దు. సైమా స్టేజ్ పై అఖిల్ పాట పాడుతున్న స్టిల్స్ మాత్ర‌మే అప్పుడు బ‌య‌ట‌కువ‌చ్చాయి.  
తాజాగా అఖిల్ పాట వీడియోను అధికారికంగా విడుద‌ల‌చేశారు. ఏవేవో క‌ల‌లు క‌న్నా…ఏవైపో క‌దులుతున్నా…అని సాగే ఈ పాట ప్ర‌స్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ లో 35వ‌స్థానంలో ఉంది. యూట్యూబ్ లో సామాన్య ప్రేక్ష‌కులతో పాటు సెల‌బ్రిటీలు ఈ పాట‌ను తెగ చూసేస్తున్నారు.  ప‌నిలోప‌నిగా అఖిల్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అఖిల్ తండ్రి నాగార్జున‌, రానా, అర‌వింద్ స్వామి, హ‌లో సంగీత ద‌ర్శ‌కుడు అనూప్ రూబెన్స్‌, సుమంత్‌, సాయేషా సైగ‌ల్ వంటి ప్ర‌ముఖులు అఖిల్ స్వ‌రం చాలా బాగుంద‌ని, చ‌క్క‌గా పాడార‌ని  ట్విట్ట‌ర్ లో ప్ర‌శంసించారు. అర‌వింద్ స్వామి అయితే చంపేసావ్…అఖిల్ అని ట్వీట్ చేశారు. త‌న‌కు ద‌క్కుతున్న ప్ర‌శంస‌ల‌పై అఖిల్ సంతోషం వ్య‌క్తంచేశారు. లైవ్ లో ప్రేక్ష‌కుల ముందు తాను పాడిన తొలి పాట ఇద‌ని,  ఈ పాట త‌న‌కెంతో ప్ర‌త్యేక‌మ‌ని అఖిల్ అన్నారు. అనూప్ రూబెన్స్ వ‌ల్లే ఇది సాధ్య‌మ‌యింద‌ని కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. 

ప‌వ‌న్ ఫ్యాన్స్ కు బ‌ర్త్ డే కానుక

0

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

PSPK 25 movie first look poster release

ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న అభిమానుల‌కు పుట్టిన‌రోజు కానుక అందించారు. త్రివిక్ర‌మ్‌శ్రీనివాస్, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న 25వ చిత్రం ఫ‌స్ట్ లుక్ రిలీజ‌యింది. దీనికోసం అభిమానులు ఎన్నాళ్ల‌నుంచో ఎదురుచూస్తున్నారు. పీఎస్‌పీకే 25 హ్యాష్ ట్యాగ్ తో సినిమా యూనిట్ కాన్సెప్ట్ పోస్ట‌ర్ రిలీజ్ చేసింది. ఈ ఫ‌స్ట్ లుక్ అప్పుడే సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చల్ చేస్తోంది. ఫ‌స్ట్ లుక్ లో ప‌వ‌న్ జ‌ల్సా సినిమాలోలా యంగ్ లుక్ తో క‌నిపిస్తున్నారు. ఓ ప‌క్క‌కు తిరిగి దీర్ఘాలోచ‌న‌లో ఉన్నట్టుగా ప‌వ‌న్ లుక్ ఉంది. అలాగే న‌డిచి వెళ్తున్న‌ట్టుగా వెన‌క నుంచి ఓ ఇమేజ్ క‌నిపిస్తోంది.

ఈ సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న కీర్తి సురేశ్‌, అనుఇమ్మానుయేల్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ చిత్రాన్నినిర్మిస్తోంది. తమిళ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. అత్తారింటికి దారేది లాంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌ర్వాత ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో వ‌స్తున్న సినిమా కావ‌టంతో దీనిపై ఇప్ప‌టికే ఇటు టాలీవుడ్ లోనూ , అటు ప్రేక్ష‌కుల్లోనూ భారీగా అంచ‌నాలున్నాయి. షూటింగ్ వేగంగా జ‌రుపుకుంటోన్న ఈసినిమాకు ఇంకా టైటిల్ ఖ‌రారు చేయ‌లేదు. ఇంజినీర్ బాబు, గోకుల కృష్ణుడు, దేవుడు దిగివ‌చ్చిన వేళ‌, రాజు వ‌చ్చినాడు వంటి టైటిల్స్ వినిపించినా…అస‌లు టైటిల్ ఏమిటో ఇంకా తెలియ‌లేదు.

ప‌వ‌న్ ఫ్యాన్స్ కు బ‌ర్త్ డే కానుక - Telugu Bullet

“మెంటల్ మదిలో ” ఏముందో ?

0

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

mental madilo movie trailer

పెళ్లిచూపులు అనే సినిమాతో భారీ విజయాన్ని అందుకుని ఇండస్ట్రీ వర్గాల్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన నిర్మాత రాజ్ కందుకూరి త్వరలో మరో సినిమాని ప్రేక్షకుల ముందుకు తేబోతున్నారు. “మెంటల్ మదిలో ” అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాకి ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ తో యూత్ ని ఆకట్టుకున్న వివేక్ ఆత్రేయ దర్శకుడు. ఈ సినిమా ట్రైలర్ తాజాగా నిర్మాత సురేష్ బాబు చేతుల మీదుగా విడుదల అయ్యింది.

శ్రీ విష్ణు హీరోగా వస్తున్న “మెంటల్ మదిలో ” సినిమా కూడా యూత్ ఫుల్ కంటెంట్ తో వస్తోంది. పెళ్లిచూపులు లాంటి హిట్ తర్వాత ఆ బ్యానర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద అంచనాలు కూడా బాగానే వున్నాయి.


మరిన్ని వార్తలు:

స్క్రిప్ట్‌ రెడీ చేసిన వైట్ల.. ఎవరికంటే!

ఎట్టకేలకు ముగించిన సూపర్‌స్టార్‌

పైసా వసూల్ ప్రివ్యూ .

పరుగెత్తే ప్ర‌తివాడూ పారిపోతున్నట్టు కాదు

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

yuddham sharanam movie theatrical trailer

నాగ‌చైత‌న్య లావ‌ణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న యుద్ధం శ‌ర‌ణం థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ యూత్ ను తెగ ఆక‌ట్టుకుంటోంది. ప‌రుగెత్తే ప్ర‌తీవాడు పారిపోతున్న‌ట్టు కాదు అంటూ నాగ‌చైత‌న్య చెప్పిన డైలాగ్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. కుటుంబంతో సంతోషంగా ఉండే హీరో జీవితంలో ఓ క్రిమిన‌ల్ కార‌ణంగా జ‌రిగిన మార్పులు, హీరోకు ఎదుర‌యిన స‌మ‌స్య‌లు, వాటిని  ఎదుర్కొన్న విధాన‌మే యుద్ధం శ‌ర‌ణం సినిమా.

ఇందులో ప్ర‌ముఖ హీరో శ్రీకాంత్ విల‌న్ ఛాయ‌లున్న పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఆడియో వేడుక‌లో సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. సెప్టెంబ‌రు 8 న సినిమా విడుద‌ల కానుంది. వారాహి చ‌ల‌న చిత్ర ప‌తాకంపై ర‌జ‌నీ కొర్ర‌పాటి ఈ సినిమా నిర్మిస్తున్నారు. నాగ‌చైత‌న్య‌కు చిన్న‌నాటి నుంచి ఫ్రెండ్ అయిన కృష్ణ ఆర్‌. వి. మారిముత్తు ఈ సినిమాకు ద‌ర్శ‌కత్వం వ‌హించారు. సినిమా ఆడియో వేడుక‌లో త‌మ స్నేహా్న్ని అంద‌రికీ వివ‌రించాడు చైతు.

తాను, డైరెక్ట‌ర్ కృష్ణ ఒకే రోజు పుట్టామ‌ని, నాలుగో త‌ర‌గ‌తి నుంచి క‌లిసి చ‌దువుకున్నామ‌ని తెలిపారు. ఎనిమిదో త‌ర‌గ‌తిలోనే త‌మ ఇద్ద‌రి మ‌ధ్య యుద్ధం మొద‌ల‌యింద‌ని,   కృష్ణ‌తో పోటీప‌డి ఓ అమ్మాయి మ‌నసు గెలుచుకున్నాన‌ని, ఆ యుద్ధంలో తాను గెలుపొందాన‌ని స‌ర‌దాగా వ్యాఖ్యానించారు. అప్ప‌టి ప్రేమ‌యుద్దంలో తాను గెలిచినా… యుద్ధం శ‌ర‌ణం విష‌యంలో మాత్రం ద‌ర్శ‌కుడిగా కృష్ణ గెలుస్తాడ‌ని చైతు అన్నారు. సినిమా రిలీజ్ కు ముందు  రెండు తెలుగు రాష్ట్రాల్లో వినూత్న రితీలో చిత్ర ప్ర‌చారం నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు.


మరిన్ని వార్తలు:

కత్తి మహేష్‌ వ్యాఖ్యలపై పవన్‌ స్పందన?

అర్జున్‌ రెడ్డిపై సమంత కామెంట్స్‌

భోగ‌న్ రీమేక్ లో మాస్ మ‌హారాజ‌

నువ్వు మ‌హానుభావుడ‌వేరా..!

0

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

sharwanand mahanubhavudu teaser

హీరోలంటే…అన్నీ పాజిటివ్ ల‌క్ష‌ణాల‌తోనే ఉండేవాడు అనే భావ‌న క్ర‌మంగా తొల‌గించేస్తున్నారు మ‌న డైరెక్ట‌ర్లు…హీరోకు ఏదో ఓ లోపం పెట్టి దాన్నే హైలెట్ గా చేసి సినిమాను న‌డిపించేస్తున్నారు. దీనివ‌ల్ల హీరోను ఏదో అసాధార‌ణ శ‌క్తిగా ఊహించేసుకోకుండా..మామూలు మనిషిగానే ప్రేక్ష‌కులు భావిస్తున్నారు. ఈ కోణంలో భ‌లే భ‌లే మ‌గాడివోయ్ అంటూ ఓ సినిమా చేసి ఘ‌న విజ‌యాన్ని అందుకున్నాడు డైరెక్ట‌ర్ మారుతి. భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమా నాని ఖాతాలో అతి పెద్ద విజ‌యాన్ని న‌మోదు చేయ‌ట‌మే కాక‌…బూతు డైలాగుల డైరెక్ట‌ర్ గా అప్ప‌టిదాకా మారుతి కి ఉన్న చెడ్డ పేరును కూడా తొల‌గించి వేసింది. ఈ ఫార్ములా వ‌ర్క‌వుట్ కావ‌టంతో మారుతి మ‌రోసారి దాన్నే న‌మ్ముకున్నాడు.

హీరో శ‌ర్వానంద్ కూడా మారుతి ఫార్ములాకు ఓటేశాడు. వారిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌స్తున్న మ‌హానుభావుడు లో హీరోకు చాలా పెద్ద లోప‌మే ఉంది. అది అలాంటి ఇలాంటి లోపం కాదు…ఓ డిజార్డ‌ర్‌..దాని పేరు ఓసీడీ. అంటే అతిశుభ్రం అన్న‌మాట‌. మ‌హానుభావుడులో శ‌ర్వానంద్ ఈ అతిశుభ్ర వ్యాధితో బాధ‌పడుతుంటాడు. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా విడుద‌ల‌యిన మ‌హానుభావుడు ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్ లో శ‌ర్వానంద్ శుభ్ర‌త ఏ స్థాయిలో ఉంటుందో మచ్చుకు రెండు ఉదాహ‌ర‌ణ‌లు చూపించారు. ఏదో చెప్ప‌బోతూ బాస్ తుమ్ముతుంటే..శ‌ర్వానంద్ ప‌రిగెత్తుకుంటూ వెళ్లి త‌న సీటులో కూర్చుంటాడు. ఈ శుభ్ర‌త ఇంత‌టితో ఆగ‌లేదు. ఆఖ‌రికి హీరోయిన్ ను ముద్దు పెట్టుకోవాల‌న్నా…ఆమెను బ్ర‌ష్ చేశావా అని అడుగుతాడు. నువ్వు మ‌హానుభావుడ‌వేరా..అని బ్యాక్ గ్రౌండ్ లో మ్యూజిక్ వ‌స్తుంటుంది. ఇద‌న్నమాట‌.

మ‌హానుభావుడు వెన‌క ఉన్న క‌థ‌. సాఫ్ట్ వేర్ గెట‌ప్ లో శ‌ర్వానంద్ బుద్ధిమంతుడిలా క‌నిపిస్తున్న సినిమా ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ప్రేక్ష‌కులకే కాదు…ఈ టీజ‌ర్ హీరోలు ప్ర‌భాస్‌, నానికి కూడా తెగ న‌చ్చేశాయి. టీజ‌ర్ ఎంతో స‌ర‌దాగా, ఆస‌క్తిక‌రంగా ఉందని ప్ర‌భాస్ ఫేస్ బుక్ లో కామెంట్ చేశాడు. వీడెవ‌డో ల‌క్కీకి క‌జిన్ లా ఉన్నాడ‌ని నాని ట్విట్ట‌ర్ లో స‌ర‌దాగా వ్యాఖ్యానించాడు. ల‌క్కీ అంటే…భ‌లే భ‌లే మ‌గాడివోయ్ లో నాని పోషించిన క్యారెక్ట‌ర్ పేరు. మొత్తానికి ద‌స‌రా కానుక‌గా వ‌స్తున్న మ‌హానుభావుడు…టీజ‌ర్ తోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడ‌న్న‌మాట‌.

మరిన్ని వార్తలు:

విదేశాంగ మంత్రిగా ట‌బు

ఎన్టీఆర్‌తో సినిమా.. నందిని రెడ్డి గొంతెమ్మ కోర్కె

ఎన్టీఆర్ కి మంచితనం గుణపాఠం అయ్యిందా ?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

Lava teaser

జైలవకుశ మీద ఏ చిన్న వార్త బయటికి వచ్చినా ఎన్టీఆర్ ఫాన్స్ ఎంతగా సంబరపడిపోతారో చూసాం. ఈ సారి వినాయకచవితికి ఒక రోజు ముందుగానే లవ పాత్రకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో ఎన్టీఆర్ లుక్ క్లాస్ గా వుంది. ఇక ఆయన చెప్పే డైలాగ్స్ అలా నిలిచిపోతాయి అనుకోవచ్చు. పుస్తకాల్లో మంచితనం ఉంటే పాఠం అవుతుంది. అదే మంచితనం మనలో ఉంటే గుణపాఠం అవుతుందని ఎన్టీఆర్ భావోద్వేగంతో చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. మొత్తానికి ట్రైలర్స్ తోటే ఫాన్స్ ని ఇంతగా ఖుషీ చేస్తున్న ఎన్టీఆర్ ఇక జైలవకుశ రిలీజ్ తో ఇంకెన్ని విన్యాసాలు చూపుతాడో ?

యానిమేటడ్ వీడియోతో భ‌య‌పెడుతున్న ఉత్త‌ర‌కొరియా

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

North Korea Releases Animated Video Of Simulated Missile Attack on America

అమెరికా భూభాగం గువామ్ పై దాడిచేస్తామంటూ ప‌దే ప‌దే హెచ్చ‌రిక‌లు చేసి చైనా జోక్యంతో వెన‌క్కి త‌గ్గిన ఉత్త‌ర‌కొరియా… మ‌ళ్లీ అణ్వ‌స్త్ర దాడి బెదిరింపుల‌కు దిగుతోంది. గువామ్ పై దాడి చేస్తే ఇలా ఉంటుందంటూ గ‌తంలో పోస్ట‌ర్లు విడుద‌ల‌చేసిన ఉత్త‌ర కొరియా ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి యానిమేటెడ్ వీడియో విడుద‌ల చేసి అమెరికాను భ‌య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది. గువామ్ దాడిచేస్తే ఎలా ఉంటుందో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టుగా చూపించింది ఆ వీడియో. అమెరికాను తీవ్ర‌మైన ప‌దజాలంతో ఉత్త‌ర‌కొరియా దూషించిన ఆ వీడియో ఇప్పుడు నెట్ లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

ఒక్క‌దెబ్బ‌తో అమెరికా పొగ‌రు అణుగుతుంద‌ని, ప్ర‌పంచంలో తామే అధికుల‌మ‌ని అమెరికా మూర్ఖులు ఊహల్లో తేలియాడుతున్నార‌ని ఉత్త‌ర‌కొరియా మండిప‌డింది. త‌మ హ‌వాంగ్ -14 న్యూక్లియ‌ర్ మిస్సైల్ అమెరికా పొగ‌రు అణుచుతుంద‌ని హెచ్చ‌రించింది. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ స‌మాధి శిలువ‌ల‌తో నిండిపోతుంద‌ని, పాపాత్ములైన అమెరిక‌న్ల‌కు న‌ర‌క‌మే గ‌తి అని తీవ్ర ప‌ద‌జాలాన్ని ప్ర‌యోగించింది. అమెరికాతో త‌ల‌ప‌డేందుకు ఉత్త‌ర‌కొరియా స‌ర్వ‌స‌న్న‌ద్దంగా ఉంద‌ని ప్ర‌క‌టించింది.

ఇప్పుడీ వీడియో ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఈ రెండు దేశాల మ‌ధ్య ఎప్పుడేం జ‌రుగుతుందో అని అంత‌ర్జాతీయ స‌మాజం ఆందోళ‌న చెందుతోంది. ఇరు దేశాల‌ మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు చ‌ల్లారిన త‌రువాత …అమెరికా ర‌క్ష‌ణ‌మంత్రి చేసిన వ్యాఖ్య‌ల‌తో మ‌ళ్లీ నిప్పు రాజుకుంది. తాము  దాడిచేస్తే ఉత్త‌ర‌కొరియా నామ‌రూపాలు లేకుండా నాశ‌న‌మ‌వుతుంద‌ని అమెరికా చేసిన వ్యాఖ్య‌లు ఉత్త‌ర‌కొరియా అధ్య‌క్షుడు కిమ్ కు ఆగ్ర‌హం తెప్పించాయి. దానికి తోడు త‌మ శ‌త్రు దేశం ద‌క్షిణ కొరియా తో క‌లిసి అమెరికా మిల‌ట‌రీ డ్రిల్ చేప‌ట్ట‌టం కిమ్ కు మ‌రింత కోపం తెప్పించింది.  దీంతో ఉత్త‌ర‌కొరియా రోజూ అమెరికాకు వ్య‌తిరేకంగా హెచ్చ‌రిక‌లు జారీచేస్తోంది.

మరిన్ని వార్తలు:

ట్రిపుల్ త‌లాక్ తీర్పుపై హ‌ర్షాతిరేకం

వ్విపోదురుగాక‌..నాకేమిటి సిగ్గు..

శిఖ‌ర్ ధావ‌న్‌కు పెరిగిన ఫాన్ ఫాలోయింగ్

చిరు 151 టైటిల్ మారింది… కటౌట్ అదిరింది – వీడియో

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

Sye Raa Narasimha Reddy First Look and cast and crew

మెగాస్టార్ చిరంజీవి అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఆతృత‌గా ఎదురుచూస్తున్న 151వ సినిమా ఫ‌స్ట్ లుక్ రిలీజ‌యింది. మెగాస్టార్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ప్ర‌చార చిత్రాన్ని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి విడుద‌ల చేశారు. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాకు సైరా న‌ర‌సింహారెడ్డి అనే టైటిల్ ఖ‌రార‌యింది. సై..సైరా న‌ర‌సింహారెడ్డి అనే నినాదాలు బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తుండ‌గా. ఓ కోట శిఖ‌రంపై కాలిపోతున్న ఆంగ్లేయుల జాతీయ జెండా.దాని చుట్టూ బ్రిటిష్ సైనికుల శ‌వాలు…కోట బ‌య‌ట ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి .

ప్ర‌చార చిత్రంలో క‌నిపిస్తున్న దృశ్యాలివే. ఫ‌స్ట్ లుక్ లో చిరంజీవి స్ప‌ష్టంగా క‌నిపించ‌లేదు. వెన‌క‌నుంచి మాత్ర‌మే క‌నిపించారు. అప్పుడే ఫ‌స్ట్ లుక్ యూ ట్యూబ్ లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్న సైరా న‌ర‌సింహారెడ్డికి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇటీవ‌లే సినిమా షూటింగ్ మొద‌ల‌యింది. చిరంజీవి ప‌క్క‌న న‌టించే హీరోయిన్ ఇంకా ఫిక్స్ కాలేదు. న‌య‌న‌తారను సంప్ర‌దించాల‌ని చిత్ర యూనిట్ భావిస్తోంది. న‌య‌న‌తార ఇప్ప‌టిదాకా చిరంజీవితో న‌టించ‌లేదు. ఈ సినిమాలో సీనియ‌ర్ హీరోయిన్ తో పాటు…ఇప్ప‌టిదాకా చిరంజీవితో క‌లిసి న‌టించ‌ని వాళ్ల‌యితే.

కాంబినేష‌న్ కొత్త‌గా ఉంటుంద‌న్న ఆలోచ‌న‌లో సురేంద‌ర్ రెడ్డి ఉన్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం న‌య‌న్‌ బాల‌కృష్ణ, కె.ఎస్ . ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఓ చిత్రంలో న‌టిస్తున్నారు. దాంతో పాటే. సైరా న‌ర‌సింహారెడ్డికీ డేట్స్ అడ్జెస్ట్ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడి జీవిత చ‌రిత్ర కావ‌టం, చిరంజీవి ఇప్ప‌టిదాకా బ‌యోపిక్స్ లో న‌టించ‌క‌పోవ‌టం, సినిమాకు చ‌రణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో ఇప్ప‌టికే సై..సైరా న‌ర‌సింహారెడ్డిపై భారీ అంచనాలు నెల‌కొన్నాయి.


మరిన్ని వార్తలు:

వారు చెబుతున్న సక్సెస్‌ నిజమేనా?

చిన్నారుల‌కు ప్రేమ‌తో నేర్పిద్దాం…కోపంతో కాదు

 Children Should be Loved

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఓ చిన్నారి త‌న పుస్త‌కంలోని 1 నుంచి 5 అంకెల‌ను స‌రిగ్గా చ‌ద‌వ‌టం లేద‌న్న కార‌ణంతో వాళ్ల‌మ్మ విప‌రీతంగా కొడుతుంటే… ఆ చిన్నారి కొట్టొద్ద‌ని వేడుకుంటూ…పెద్ద‌గా ఏడుస్తూ..మ‌ళ్లీ మ‌ళ్లీ ఆ అంకెల‌ను స‌రిగ్గా ఉచ్ఛ‌రించ‌టానికి ప్ర‌య‌త్నిస్తున్న ఓ వీడియో ఇప్పుడు నెట్ లో విప‌రీతంగా షేర్ అవుతోంది. వీడియోలో ఆ చిన్నారి ఏడుపు చూసిన ప్ర‌తి ఒక్క‌రికి హృద‌యం ద్ర‌వించిపోతోంది. ముద్దులొలికే చిన్నారి క‌ళ్ల వెంట కారుతున్న క‌న్నీళ్లు…దెబ్బ‌ల‌కు తాళ‌లేక ఆ చిన్నారి పడుతున్న బాధ చూసిన వాళ్లంతా..

పాప త‌ల్లిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు.  క‌న్నత‌ల్లి చ‌దువు విషయంలో అయినా.. పిల్ల‌ల‌తో ఇంత క‌ర్క‌శంగా ప్ర‌వ‌ర్తించ‌కూడ‌ద‌ని నెటిజ‌న్లు కామెంట్లు గుప్పిస్తున్నారు. సామాన్యులే కాదు..సెల‌బ్రిటీలు ఈ వీడియో చూసి తీవ్ర ఆవేద‌న వ్య‌క్తంచేస్తున్నారు. ఇండియ‌న్ క్రికెట్‌ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు క్రికెట‌ర్లు శిఖ‌ర్ ధావ‌న్‌, యువ‌రాజ్ సింగ్‌, రాబిన్ ఊత‌ప్ప ఈ వీడియో పై స్పందించారు. త‌మ వ్య‌క్తిగ‌త ట్విట్ట‌ర్  ఎకౌంట్ లో ఈ వీడియోను పోస్ట్ చేసిన క్రికెట‌ర్లు …

చిన్నారులను మ‌నం ప్రేమించాల‌ని  కోరారు. పిల్ల‌ల ప‌ట్ల త‌ల్లిదండ్రులు ప్రేమాభిమానాల‌తో పాటు ఓర్పుగా ఉండాల‌ని సూచించారు. ప్ర‌తి చిన్నారికి సొంతంగా నేర్చుకునే గుణం ఉంటుంద‌ని, దాన్ని గౌర‌విద్దామ‌ని, ఓర్పుగా నేర్పుదామ‌ని త‌ల్లిదండ్రుల‌ను కోరారు. త‌ల్లిదండ్రులు చిన్నారులెవ‌ర‌నీ కొట్ట‌వ‌ద్ద‌ని, అన‌వ‌స‌రంగా వారిపై కోపం ప్ర‌ద‌ర్శించ‌వ‌ద్ద‌ని క్రికెట‌ర్లు సూచించారు. మ‌న క్రికెట‌ర్లు అయితే ఇలా సునిశిత విమ‌ర్శ‌లు, స‌ల‌హాల‌తో స‌రిపెట్టారు కానీ…సామాజిక మాధ్య‌మాల్లో కొంద‌రు నెటిజ‌న్లు చిన్నారి త‌ల్లిపై తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. ఆమెకు త‌ల్లి అయ్యే అర్హ‌త లేద‌ని, ఆమెను నార్వే పంపించి ఆ చిన్నారికి విముక్తి క‌ల్పించాల‌ని ఆగ్ర‌హిస్తున్నారు.

రాహుల్ ప్ర‌సంగం…సోష‌ల్ మీడియాలో వైర‌ల్

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]  

Rahul Gandhi tongue Slips Refers Indira Canteen' As Amma Canteen

రాజ‌కీయ నాయ‌కుల ప్ర‌సంగం అంటే ప్ర‌జ‌ల‌కు ఎంతో ఆస‌క్తి ఉంటుంది. కొంత మంది నేత‌లు కేవ‌లం ప్ర‌సంగాల ద్వారానే ఎన్నిక‌ల్లో గెలిచిన సంద‌ర్బాలున్నాయి. అద్భుత‌రీతిలో ప్ర‌సంగాలు చేస్తూ… కొంద‌రు నేత‌లు ఎన్నిక‌ల స‌మయంలో ప్ర‌జ‌ల మైండ్ సెట్ మార్చేసి అనూహ్యంగా గెలుపొందుతూ ఉంటారు. అప్ప‌టిక‌ప్పుడు మాట్లాడేద‌యినా… ముందు రాసిపెట్టింది చ‌దివేది అయినా ప్ర‌సంగ స‌మ‌యంలో నేత‌లు ఎంతో జాగ్ర‌త్త‌గా ఉంటారు. ఎక్క‌డా తప్పులు దొర్ల‌కుండా చూసుకుంటారు.  ప్ర‌సంగాల ద్వారా వ్య‌క్తిగ‌త ఇమేజీని పెంచుకున్న నేతలెంద‌రో  దేశ రాజ‌కీయాల్లో ఉన్నారు. అంతెందుకు గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మోడీ త‌న ప్ర‌సంగాల ద్వారానే దేశ‌మంతా పాపుల‌ర‌య్యారు. కానీ ఆయ‌న ప్ర‌త్య‌ర్థి, ఏఐసీసీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి మాత్రం ప్ర‌సంగాల‌పై అంత ప‌ట్టు లేదు. భారీ బ‌హిరంగ స‌భ‌ల్లో సైతం ఎక్కువ‌గా మాట్లాడ‌ని రాహుల్ …మైక్ ముందున్నంత సేపూ ఇబ్బందిగానే ఉన్న‌ట్టు క‌నిపిస్తారు. ఆ క్ర‌మంలోనే కొన్నిసార్లు త‌ప్పులు మాట్లాడేస్తుంటారు.

గ‌తంలో అయితే వీటిని ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు కానీ…ఇప్పుడు సోష‌ల్ మీడియా పుణ్య‌మాని ఇలాంటివే ఎక్కువ‌గా ప్ర‌జ‌ల నోళ్ల‌ల్లో నానుతున్నాయి. తాజాగా క‌ర్నాట‌క‌లో రాహుల్ చేసిన ప్ర‌సంగం ఒక‌టి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. రాహుల్ గాంధీ ఇటీవ‌ల బెంగ‌ళూరులో ఇందిరా క్యాంటిన్లు ప్రారంభించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ ఇందిరా క్యాంటిన్స్ అన‌బోయి పొర‌పాటున అమ్మ క్యాంటిన్స్ అన్నారు. అర‌గంట పాటు సాగిన ఈ ప్ర‌సంగ‌మంతా త‌ప్పుల త‌డ‌క‌లే. ఇందిరా క్యాంటిన్లు క‌ర్నాట‌క‌లోని అన్ని న‌గ‌రాల్లో ప్రారంభిస్తాము అన‌టానికి బ‌దులుగా బెంగ‌ళూరులోని ప్ర‌తి న‌గ‌రంలో అన్నారు. క్యాంటిన్ల‌కు బ‌దులు క్యాంపెయిన్లు అని కూడా పొర‌పాటున ప‌లిక‌న రాహుల్ గాంధీ ప్ర‌సంగంపై నెటిజ‌న్లు కామెంట్లు గుప్పిస్తున్నారు. న‌రేంద్ర‌మోదీకి ప్ర‌త్యామ్నాయంగా ఎద‌గ‌టం సంగ‌తి ప‌క్క‌న‌పెట్టి…ముందు త‌న ప్ర‌సంగాల‌ను మెరుగుప‌ర్చుకోవాల‌ని సూచిస్తున్నారు. రాహుల్ గాంధీ కుటుంబం ప్ర‌సంగాల‌కు ప్ర‌జాద‌ర‌ణ ఎంత‌గానో ఉంటుంది. దేశ ప్ర‌థ‌మ ప్ర‌ధాని నెహ్రూ ప్ర‌సంగిస్తుంటే ప్ర‌జ‌లు ఆసాంతం క‌ద‌ల‌కుండాకూర్చుని తిలకించేవారు. ఇక ఇందిరాగాంధీ ప్ర‌సంగించ‌టానికి వ‌స్తుంటేనే ప్ర‌జ‌ల్లో ఉత్తేజం నెల‌కొనేది. రాజీవ్ గాంధీ ప్ర‌సంగాలూ ప్ర‌జ‌ల‌ను బాగానే ఆక‌ట్టుకునేవి. వారి వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకున్న రాహుల్‌… వారి ప్ర‌సంగపాట‌వాల‌ను మాత్రం అల‌వ‌ర్చుకోలేక‌పోయారు.

 

మరిన్ని వార్తలు:

నంద్యాలలో ఆ డౌట్ క్లియర్ చేస్తున్న ఈసీ.

ఇన్ఫోసిస్ లో భారీ కుదుపు

నంద్యాలలో అడ్డంగా దొరికిపోయిన వైసీపీ.